Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tadipatri Tension: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వైసీపీ, టీడీపీలు తలపెట్టిన రాజకీయ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీకి వైసీపీ పిలుపునివ్వగా.. మరోవైపు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది. అయితే, రెండు ప్రధాన పార్టీల కార్యక్రమాలకు ఎలాంటి పోలీసు అనుమతులు లేవని తాడిపత్రి ఇన్చార్జి డీఎస్పీ ఏ. శ్రీనివాస్ స్పష్టం చేశారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, సాధారణ ప్రజల జీవనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అదే సమయంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఇంటింటికీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. దీంతో పట్టణంలో ఇరుపార్టీల కార్యకలాపాలపై ఉత్కంఠ నెలకొంది. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం లేదా పెద్ద సంఖ్యలో గుమిగూడేందుకు ప్రయత్నించడం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాడిపత్రి పట్టణంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
- Minister Satyakumar: అమరావతిపై జగన్కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?
డీఎస్పీ సూచనలు..
* శాంతి భద్రతలకు ప్రాధాన్యం : తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా చూసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, వాటి నాయకులు మరియు కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
* ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : పోలీస్ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు లేదా గుమ్మిగూడే ప్రయత్నాలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* భద్రత పెంపు : పట్టణంలో ముందస్తు జాగ్రత్త చర్యగా అదనపు పోలీస్ బలగాలను మోహరించడం జరిగిందని, ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేస్తే, వారిపై చట్టపరమైన కఠినమైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్తో బాలీవుడ్లో కలకలం
-
Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!