Rebel MLAs Disqualification: విచారణకు రావడం లేదు.. స్పీకర్కు రెబల్ ఎమ్మెల్యేల లేఖ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rebel MLAs Disqualification: రెబల్ ఎమ్మెల్యే విచారణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.. ఈ రోజు విచారణకు రావడం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) రెబల్ ఎమ్మెల్యేలు.. తమకు మరో రెండు వారాల సమయం ఇవ్వాలని స్పీకర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల హాజరుపై కూడా ఉత్కంఠ నెలకొంది.
Read Also: Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగాన్ని నిరాకరించిన గవర్నర్
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
మొత్తంగా రాజ్యసభ ఎన్నికల వేళ రెబల్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఉత్కంఠ కలిగిస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలపై వేటు..! అనర్హత పిటిషన్లకు రాజ్యసభ ఎన్నికలకు ముడిపడిఉండడంతో.. అంతా ఏమవుతుందా? అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అసలు స్పీకర్ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోన్న నేపథ్యంలో.. ఈ రోజు మూడోసారి విచారణకు పిలిచారు స్పీకర్ తమ్మినేని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఉదయం పూట విచారణకు హాజరుకావాలని.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం విచారణకు రావాలని సూచించారు. కానీ, ఈ రోజు విచారణకు హాజరుకావాల్సి ఉన్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఉండవల్లి శ్రీనిదేవి.. తాము వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు హాజరుకావడంలేదని.. తాము విచారణకు హాజరుకావాలంటే మరో రెండు వారాల గడువు ఇవ్వాలని కోరుతూ స్పీకర్కు లేఖలు రాసినట్టుగా తెలుస్తోంది. అయితే, నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఈ రోజు స్పీకర్ విచారణకు హాజరవుతారా? లేదా వారు కూడా డుమ్మకొడతారా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే మూడు సార్లు విచారణకు పిలిచిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. మరోసారి అవకాశం ఇస్తారా? లేదా రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలకు దిగనున్నారు..? ఎలాంటి చర్యలు ఉంటాయి? అనేది ఆసక్తికరంగా మారిపోయింది.
తాజావార్తలు
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!