IND vs NZ Semi Final 2023: భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్కు బెదిరింపు.. వాంఖడే స్టేడియం భారీ భద్రత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Police Receive Threat Message Ahead Of IND vs NZ Semi Final 2023 Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్ల్లో గెలిచి సత్తాచాటిన టీమిండియా.. సెమీస్లోనూ అదే జోరును కొనసాగించాలనే కసితో ఉంది. ఈ సెమీస్ గెలిచి 2019 పరాభవానికి న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు సెమీస్లో గెలిచి అందని ద్రాక్షగా ఉన్న వన్డే ప్రపంచకప్కు మరింత చేరువ కావాలని న్యూజిలాండ్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు బెదిరింపులు రావడం ప్రస్తుతం కలకలం రేపింది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే సయమంలో వాంఖడే స్టేడియంలో దారుణమైన ఘటన చోటుచేసుకోనుంది అని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎక్స్ (ట్విటర్)లో బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబై పోలీసులు తెలిపారు. తన పోస్ట్లో ముంబై పోలీసులను ట్యాగ్ చేసిన ఆ వ్యక్తి.. తుపాకీ, హ్యాండ్గ్రనేడ్, బుల్లెట్ ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దాంతో దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. వాంఖడే స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.
Also Read
- Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది".. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
Also Read: IND vs NZ Semi Final 2023: ఒక్క డబుల్ డిజిట్ లేదు..సెమీస్ అంటే ‘కింగ్’ కోహ్లీకి వణుకా?
వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్లకు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరు 14న జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అహ్మాదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంపై దాడి చేస్తామంటూ అప్పుడు ఓ ఈ-మెయిల్ వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు.. ఆపై నిందితుడిని అరెస్టు చేశారు. ఇప్పుడు భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్కు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మైదానంలో హాయిగా మ్యాచ్ ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు ఈ న్యూస్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!