Randeep Singh Surjewala: కాంగ్రెస్ నేత సుర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీకి సపోర్ట్ చేసే వారంతా రాక్షసులే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు, ఆ పార్టీకి ఓట్లేసి, సపోర్ట్ చేసే వారంతా రాక్షసులే అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని కైతాల్ లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ ‘జన్ ఆక్రోష్ ర్యాలీ’లో సుర్జేవాలా పాల్గొని మాట్లాడారు. ‘‘ఉద్యోగం ఇవ్వకండి, కనీసం ఉద్యోగంలో కూర్చోవడానికి అవకాశం ఇవ్వండి. బీజేపీ, జేజేపీలో నాయకులు రాక్షసులు. బీజేపీకి ఓటేసి, వారికి మద్దతిచ్చే వారు కూడా రాక్షసులే. ఈ రోజు నేను ఈ మహాభారత భూమి నుండి శపిస్తున్నాను.’’ అని సుర్జేవాలా అన్నారు.
Read Also: Land Auction: మరోసారి భారీ భూ వేలం.. నోటిఫికేషన్ విడుదల
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు బీజేపీ నేతలు స్పందిస్తూ.. తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీ ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. “పదేపదే ఎన్నికల ఓటములు కాంగ్రెస్ను అప్రస్తుతంలోకి నెట్టాయి. ” అని ఆయన అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. యువరాజు (రాహుల్ గాంధీ)ను పదేపదే లాంచ్ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలను, జనార్ధన్ ను దూషించడం ప్రారంభించిందని ఆరోపించారు. ‘‘ప్రధాని మోడీ, బీజేపీ వల్ల అంధత్వానికి గురైన కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా చెప్పిన మాటలు వినండి’’ అంటూ ఆయన ఈ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
Read Also: Vithika Sheru: బ్రా కలక్షన్స్ చూపించిన వరుణ్ భార్య.. సిగ్గుపడకండి
మరోవైపు తన వ్యాఖ్యలపై సూర్జేవాలా వివరణ ఇచ్చారు. భావోద్వేగ సమస్యల వెనుక బీజేపీ తన వైఫల్యాలను దాచిపెడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఉటంకిస్తూ, “సమాజాన్ని ద్వేషపూరిత మంటల్లోకి నెట్టి, యువకుల కలలను చంపిన వారు రాక్షసుల కంటే తక్కువేనా?” అని సుర్జేవాలా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!