Beating Muslim student: ముస్లిం విద్యార్థిని కొట్టించిన టీచర్.. సీరియస్ అయిన సుప్రీం కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లోని ఓ పాఠశాల టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవలే జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ టీచర్ పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చదువు నేర్పించాల్సిన ఓ టీచర్ ఇలా చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక ఈ ఘటనపై దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పందించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం దీనిపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల తమకు తీవ్ర అభ్యంతరాలున్నట్టు న్యాయమూర్తులు పేర్కొ్న్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీ వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
Also Read: KL Rahul Six: చూడ్డానికి సన్నగా ఉన్నా.. బంతి మాత్రం స్టేడియం బయట పడింది!
Also Read
- భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
- Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
ఆ ఉపాధ్యాయురాలు ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పే విధానం ఇదేనా అంటూ ధర్మాసనం మండిపడింది. నాణ్యమైన విద్య అందించడం అంటే ఇదేనా అని ప్రశ్నించిన కోర్టు పాఠశాల సదరు విద్యార్థికి కౌన్సిలర్ ను నియమించిందా? అని విచారించింది. ఇది తీవ్రమైన సమస్య అని ఇది రాష్ట్రప్రభుత్వాన్ని కదిలించాలని అభిప్రాయపడింది. ద్యార్థులపై శారీరక, మానసిక వేధింపులను, కులం, మతం ప్రాతిపదికన వివక్షను విద్యా హక్కు చట్టం నిషేధిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. సదరు విద్యార్థికి కౌన్సిలింగ్ ఇప్పించాలని, దాంతో ట్రామా నుంచి అతడు కోలుకోగలడని యూపీ సర్కారును కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసుపై దర్యాప్తును వేగవంతం చేసి నివేదికను అందించడానికి సీనియర్ ఐపీఎస్ అధికారి నియమించాలని ఆదేశించిన ధర్మాసనం మూడు వారాల సమయం ఇచ్చింది. ఘటన జరిగిన వెంటనే ఆ స్కూల్ లైసెన్స్ ను రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆ ఘటనలో గాయపడిన విద్యార్థి మాత్రం ఇంకా ఆ భయంలోనే ఉన్నట్లు బాలుడి తండ్రి తెలిపాడు.
తాజావార్తలు
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!