Supreme Court:వక్ఫ్ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు అడిగిన మూడు ప్రశ్నలు ఇవే…
- వక్ఫ్ చట్టం 2025ను సవాలు చేస్తూ పిటిషన్లు
- నేడు పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
- ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించిన న్యాయస్థానం
- సమయం కోరిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ (సవరణ) చట్టం 2025 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్నలు సంధించింది. ముస్లింలను హిందూ మత ట్రస్టులలో చేరడానికి అనుమతిస్తారా ? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అనేక వక్ఫ్ ఆస్తులకు రిజిస్ట్రీ వంటి పత్రాలు లేనప్పుడు.. ‘వక్ఫ్ బై యూజర్’ చెల్లదని ఏ ప్రాతిపదికన ప్రకటిస్తారు? అని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
READ MORE: Khushi Kapoor : ప్రియుడి పేరుతో చైన్.. ఖుషి కపూర్ డేటింగ్..?
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
‘వక్ఫ్ బై యూజర్’ వ్యవస్థను రద్దు చేయడం అనేది ఇప్పటికే ఉన్న వ్యవస్థను తిరగదోడడమే అవుతుందని, ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని మూడు ముఖ్యమైన ప్రశ్నలు అడిగింది. ఈ మూడు అంశాలపై వాదించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరారు. ప్రస్తుతానికి ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం లేదని, అయితే గురువారం కూడా కేసు విచారణ కొనసాగుతుందని కోర్టు తెలిపింది. గురువారం విచారణ ముగిసిన తర్వాత, సుప్రీంకోర్టు ఈ అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
ఆ ప్రశ్నలు ఇవే..
1. వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయవచ్చా?
2. కలెక్టర్ దర్యాప్తు సమయంలో వక్ఫ్ గుర్తింపుపై స్టే విధించడం సముచితమేనా?
3. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చుకోవచ్చా?
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!