ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించుతోంది. ముఖ్యంగా పోలీసుల విచారణలో ఉన్న నిందితుల ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం, వాహనాలపై ‘మీడియా’ స్టిక్కర్లు వేసుకుని తిరగడం వంటి అంశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విచారణ పూర్తికాకముందే నిందితులను దోషులుగా చిత్రీకరించేలా సాగుతున్న ఈ ధోరణి పట్ల ధర్మాసనం ఆందోళన చెందింది. నగరాల్లో చాలామంది తమ వ్యక్తిగత వాహనాలపై ‘మీడియా’ అని స్టిక్కర్లు అంటించుకుని…