Supreme Court: జ్ఞానవాపి కేసులో సుప్రీం కీలక ఆదేశాలు.. సర్వే నాన్-ఇన్వేసివ్ టెక్నిక్లో చేయాలని షరతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు శాస్త్రీయ సర్వేను ఆపాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను నిరాకరిచిన సుప్రీం.. సర్వేను ‘నాన్-ఇన్వేసివ్ టెక్నిక్’లో కొనసాగించాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించింది. ఇంతకు ముందు.. 17వ శతాబ్ది నాటి మసీదులో వజూఖానా మినహా మిగతా ప్రాంగణమంతా సర్వే జరిపారు. అయితే హిందూ ఆలయం స్థానంలో ఈ కట్టడాన్ని నిర్మించారా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించాలని వారణాసి జిల్లా కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో మసీదు ప్రాంగణంలో సర్వే కొనసాగించుకోవడానికి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఏఎస్ఐ అధికారులు సర్వే చేపట్టారు.
Pawan Kalyan Serious on Janasena Leaders: జనసేన నేతలకు క్లాస్ పీకిన పవన్.. అది సమయం వృథా..!
Also Read
- Saikrishna Custodial Death Case: సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టు.. వెలుగులోకి సంచనల విషయాలు!
- 6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
- Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్లోనే కాదు.. పాకిస్థాన్లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా మసీదు కమిటీ వాదనలు వినిపిస్తూ.. ‘‘ప్రార్థనా ప్రదేశాల చట్టాలను ఉల్లంఘిస్తూ ఏఎస్ఐ.. 500 ఏళ్ల నాటి చరిత్రను తిరగదోడాలని చూస్తోంది. ఇలా చేస్తే గత గాయాలను మళ్లీ తెరిచినట్టే’’ అని తెలిపింది. మరోవైపు పురావస్తు శాఖ, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. సర్వే సమయంలో మసీదు ప్రాంగణంలో ఎలాంటి తవ్వకాలు చేయలేదని, నిర్మాణాలను ధ్వంసం చేయబోమని తెలిపారు.
Manik Rao Thackeray: ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోంది..
అయితే ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేను కొనసాగించొచ్చని పేర్కొంది. కానీ దానికి ఒక షరతు అని పేర్కొంది. ‘నాన్-ఇన్వేసివ్’ పద్ధతిలో సర్వే జరగాలని ఆదేశించింది. మసీదు నిర్మాణాన్ని ధ్వంసం చేసేలా సర్వేలో ఎలాంటి పరికరాలను ఉపయోగించద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
OnePlus 16T: వన్ప్లస్ 16T వచ్చేస్తోంది.. 6.3 ఇంచెస్ హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే.. స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్
-
Saikrishna Custodial Death Case: సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టు.. వెలుగులోకి సంచనల విషయాలు!
-
Tamannaah Bhatia: బాలీవుడ్, టాలీవుడ్ మధ్య తేడాలపై తమన్నా సంచలన వ్యాఖ్యలు!
-
Tollywood: విమర్శలు వస్తే బ్రేక్ తీసుకోవాల్సిందేనా!
-
Chiranjeevi : అవార్డులపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!