Supreme Court: ఎన్నారై కోటా ముసుగులో మోసానికి యత్నం!
- మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లో ఎన్ఆర్ఐ బంధువులకు రిజర్వేషన్లు కల్పించాలన్ని పంజాబ్
- ఈ పిటిషన్ ను కొట్టేసిన హర్యానా హైకోర్ట్
- సుప్రీంకోర్టును సంప్రదించిన ప్రభుత్వం
- ప్రభుత్వానికి అత్యున్నత న్యాస్థానం చివాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) దూరపు బంధువులకు రిజర్వేషన్లు కల్పించడం మోసమని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. ఇది మోసమని, దీన్ని అరికట్టాలని చూచించింది. మెడికల్ కాలేజీల్లో ఎన్నారై కోటాను పెంచాలన్న పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్ఆర్ఐల దూరపు బంధువులకు అడ్మిషన్లో రిజర్వేషన్ ప్రయోజనం కల్పించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మోసం ఆగాలంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15% ఎన్ఆర్ఐ కోటాను ప్రవేశపెట్టాలని కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ద్వారా ప్రవేశానికి నిబంధనలను సవరిస్తూ పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను ఈ నెల ప్రారంభంలో పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ అనిల్ క్షేత్రపాల్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్ఆర్ఐ అభ్యర్థులకు దూరపు బంధువులను చేర్చేలా నిర్వచనాన్ని విస్తృతం చేస్తూ ‘పూర్తిగా అసమంజసమైనది’ అని తీర్పు చెప్పింది.
ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రవేశాల సమయంలో ఎన్ఆర్ఐ దగ్గరి బంధువును కూడా పరిగణనలోకి తీసుకుంటామని మీరు చెప్తున్నారు. అసలు అదేంటి..? ఇదంతా ఆదాయం పొందే వ్యూహం’’ అని వ్యాఖ్యానించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా కూడా హైకోర్టు తీర్పును సమర్థించారు. ‘‘ఈ ఎన్ఆర్ఐ కోటా బిజినెస్ను మనం ఆపివేయాలి. ఇది పూర్తిగా మోసం. మీరు చెప్తున్న అభ్యర్థితో పోల్చుకుంటే.. మూడు రెట్లు ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అడ్మిషన్ దొరకదు. సదరు అభ్యర్థులందరూ భారతీయులే.. కానీ వారు కేవలం ఎన్ఆర్ఐకు బంధువులు’’ అంటూ సుప్రీం ధర్మాసనం ఈ నిబంధనను తప్పుపట్టింది. చట్టవిరుద్ధమైన వాటిని కోర్టు నిస్సంకోచంగా తోసిపుచ్చుతుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!