Supreme Court: ఎన్నారై కోటా ముసుగులో మోసానికి యత్నం!
- మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లో ఎన్ఆర్ఐ బంధువులకు రిజర్వేషన్లు కల్పించాలన్ని పంజాబ్
- ఈ పిటిషన్ ను కొట్టేసిన హర్యానా హైకోర్ట్
- సుప్రీంకోర్టును సంప్రదించిన ప్రభుత్వం
- ప్రభుత్వానికి అత్యున్నత న్యాస్థానం చివాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) దూరపు బంధువులకు రిజర్వేషన్లు కల్పించడం మోసమని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. ఇది మోసమని, దీన్ని అరికట్టాలని చూచించింది. మెడికల్ కాలేజీల్లో ఎన్నారై కోటాను పెంచాలన్న పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్ఆర్ఐల దూరపు బంధువులకు అడ్మిషన్లో రిజర్వేషన్ ప్రయోజనం కల్పించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మోసం ఆగాలంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15% ఎన్ఆర్ఐ కోటాను ప్రవేశపెట్టాలని కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది
Also Read
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ద్వారా ప్రవేశానికి నిబంధనలను సవరిస్తూ పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను ఈ నెల ప్రారంభంలో పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ అనిల్ క్షేత్రపాల్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్ఆర్ఐ అభ్యర్థులకు దూరపు బంధువులను చేర్చేలా నిర్వచనాన్ని విస్తృతం చేస్తూ ‘పూర్తిగా అసమంజసమైనది’ అని తీర్పు చెప్పింది.
ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రవేశాల సమయంలో ఎన్ఆర్ఐ దగ్గరి బంధువును కూడా పరిగణనలోకి తీసుకుంటామని మీరు చెప్తున్నారు. అసలు అదేంటి..? ఇదంతా ఆదాయం పొందే వ్యూహం’’ అని వ్యాఖ్యానించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా కూడా హైకోర్టు తీర్పును సమర్థించారు. ‘‘ఈ ఎన్ఆర్ఐ కోటా బిజినెస్ను మనం ఆపివేయాలి. ఇది పూర్తిగా మోసం. మీరు చెప్తున్న అభ్యర్థితో పోల్చుకుంటే.. మూడు రెట్లు ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అడ్మిషన్ దొరకదు. సదరు అభ్యర్థులందరూ భారతీయులే.. కానీ వారు కేవలం ఎన్ఆర్ఐకు బంధువులు’’ అంటూ సుప్రీం ధర్మాసనం ఈ నిబంధనను తప్పుపట్టింది. చట్టవిరుద్ధమైన వాటిని కోర్టు నిస్సంకోచంగా తోసిపుచ్చుతుందని పేర్కొంది.
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!