Supreme Court: ఎన్నారై కోటా ముసుగులో మోసానికి యత్నం!
- మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లో ఎన్ఆర్ఐ బంధువులకు రిజర్వేషన్లు కల్పించాలన్ని పంజాబ్
- ఈ పిటిషన్ ను కొట్టేసిన హర్యానా హైకోర్ట్
- సుప్రీంకోర్టును సంప్రదించిన ప్రభుత్వం
- ప్రభుత్వానికి అత్యున్నత న్యాస్థానం చివాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) దూరపు బంధువులకు రిజర్వేషన్లు కల్పించడం మోసమని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. ఇది మోసమని, దీన్ని అరికట్టాలని చూచించింది. మెడికల్ కాలేజీల్లో ఎన్నారై కోటాను పెంచాలన్న పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్ఆర్ఐల దూరపు బంధువులకు అడ్మిషన్లో రిజర్వేషన్ ప్రయోజనం కల్పించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మోసం ఆగాలంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15% ఎన్ఆర్ఐ కోటాను ప్రవేశపెట్టాలని కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది
Also Read
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ద్వారా ప్రవేశానికి నిబంధనలను సవరిస్తూ పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను ఈ నెల ప్రారంభంలో పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ అనిల్ క్షేత్రపాల్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్ఆర్ఐ అభ్యర్థులకు దూరపు బంధువులను చేర్చేలా నిర్వచనాన్ని విస్తృతం చేస్తూ ‘పూర్తిగా అసమంజసమైనది’ అని తీర్పు చెప్పింది.
ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రవేశాల సమయంలో ఎన్ఆర్ఐ దగ్గరి బంధువును కూడా పరిగణనలోకి తీసుకుంటామని మీరు చెప్తున్నారు. అసలు అదేంటి..? ఇదంతా ఆదాయం పొందే వ్యూహం’’ అని వ్యాఖ్యానించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా కూడా హైకోర్టు తీర్పును సమర్థించారు. ‘‘ఈ ఎన్ఆర్ఐ కోటా బిజినెస్ను మనం ఆపివేయాలి. ఇది పూర్తిగా మోసం. మీరు చెప్తున్న అభ్యర్థితో పోల్చుకుంటే.. మూడు రెట్లు ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అడ్మిషన్ దొరకదు. సదరు అభ్యర్థులందరూ భారతీయులే.. కానీ వారు కేవలం ఎన్ఆర్ఐకు బంధువులు’’ అంటూ సుప్రీం ధర్మాసనం ఈ నిబంధనను తప్పుపట్టింది. చట్టవిరుద్ధమైన వాటిని కోర్టు నిస్సంకోచంగా తోసిపుచ్చుతుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!