Mahesh Babu: హరిద్వార్లో మహేశ్ బాబు.. గంగలో తల్లి అస్థికలు నిమజ్జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె అస్థికలను మహేశ్ హరిద్వార్ తీసుకెళ్లి అక్కడ గంగలో కలిపారు. కొన్ని నెలల క్రితమే మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబును కోల్పోయాడు. ఇక ఇప్పుడు ఎంతగానో ఇష్టపడే తల్లి కూడా తనువు చాలించడంతో మహేష్ బాబు ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను కూడా మహేష్ బాబు ప్రత్యేకంగా దగ్గరుండి పూర్తి చేశాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి గురించి చాలా ఇంటర్వ్యూలలో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా అమ్మ చేతి కాఫీ తాగితే ఆ టెన్షన్స్ అన్నీ కూడా తీరిపోతాయి అని చాలా ఇంటర్వ్యూలలో తెలియజేశాడు. హఠాత్తుగా ఆమె చనిపోవడంతో శోకసంద్రంలో మునిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి మహేష్ బాబుకు చాలా సమయం పడుతుంది అని అర్థమవుతుంది. అయితే ఇదే తరుణంలో మహేష్ బాబు హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియల్లో పాల్గొని ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలను కూడా బాధ్యతతో నిర్వహిస్తున్నాడు.
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
Read Also: Adipuruash: ‘ఆదిపురుష్’లో ఆ సీన్లు తొలగించాల్సిందే.. ఎంపీ హోంమంత్రి
తల్లి అస్థికలతో మహేష్ ఇక మహేష్ బాబు ఇటీవల తల్లి అస్థికలతో కనిపించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేశ్ తల్లి కర్మలు చేసేందుకు సాంప్రదాయ దుస్తులను ధరించారు. లుంగి పంచె కట్టుకుని ఆయన మెడలో కండువాతో పూజల్లో పాల్గొన్నారు.
తల్లి మృతి చెందడంతో మహేష్ ప్రస్తుతం సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని తెలుస్తోంది. ఇదివరకే సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మహేష్ బాబు తల్లి మృతి చెందడంతో ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన చర్చల్లో పాల్గొనడం లేదు. పూర్తి స్థాయిలో మహేష్ బాబు ఆ బాధ నుంచి కోలుకున్న తర్వాతనే షూటింగ్ మొదలుపెట్టాలి అని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!