Mahesh Babu: హరిద్వార్లో మహేశ్ బాబు.. గంగలో తల్లి అస్థికలు నిమజ్జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె అస్థికలను మహేశ్ హరిద్వార్ తీసుకెళ్లి అక్కడ గంగలో కలిపారు. కొన్ని నెలల క్రితమే మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబును కోల్పోయాడు. ఇక ఇప్పుడు ఎంతగానో ఇష్టపడే తల్లి కూడా తనువు చాలించడంతో మహేష్ బాబు ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను కూడా మహేష్ బాబు ప్రత్యేకంగా దగ్గరుండి పూర్తి చేశాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి గురించి చాలా ఇంటర్వ్యూలలో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా అమ్మ చేతి కాఫీ తాగితే ఆ టెన్షన్స్ అన్నీ కూడా తీరిపోతాయి అని చాలా ఇంటర్వ్యూలలో తెలియజేశాడు. హఠాత్తుగా ఆమె చనిపోవడంతో శోకసంద్రంలో మునిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి మహేష్ బాబుకు చాలా సమయం పడుతుంది అని అర్థమవుతుంది. అయితే ఇదే తరుణంలో మహేష్ బాబు హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియల్లో పాల్గొని ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలను కూడా బాధ్యతతో నిర్వహిస్తున్నాడు.
Also Read
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
Read Also: Adipuruash: ‘ఆదిపురుష్’లో ఆ సీన్లు తొలగించాల్సిందే.. ఎంపీ హోంమంత్రి
తల్లి అస్థికలతో మహేష్ ఇక మహేష్ బాబు ఇటీవల తల్లి అస్థికలతో కనిపించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేశ్ తల్లి కర్మలు చేసేందుకు సాంప్రదాయ దుస్తులను ధరించారు. లుంగి పంచె కట్టుకుని ఆయన మెడలో కండువాతో పూజల్లో పాల్గొన్నారు.
తల్లి మృతి చెందడంతో మహేష్ ప్రస్తుతం సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని తెలుస్తోంది. ఇదివరకే సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మహేష్ బాబు తల్లి మృతి చెందడంతో ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన చర్చల్లో పాల్గొనడం లేదు. పూర్తి స్థాయిలో మహేష్ బాబు ఆ బాధ నుంచి కోలుకున్న తర్వాతనే షూటింగ్ మొదలుపెట్టాలి అని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Harry Brook: వరల్డ్ నంబర్వన్ భారత్పై రెండు సిరీస్లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
-
Honor X7e Plus 5G: హానర్ X7e ప్లస్ 5G రిలీజ్.. 8100mAh బ్యాటరీ, Snapdragon 4 Gen 4 చిప్, 50MP కెమెరా
-
Jantar Mantar Protest: జంతర్మంతర్లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
-
Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
-
Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!