SRH vs RR: సొంత గడ్డపై సన్రైజర్స్ ఘన విజయం.. ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. తొలి మ్యాచ్ ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఆరు వికెట్లకు 286 పరుగులు చేసింది. 287 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 242 పరుగులకే పరిమితమైంది. 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి ఓటమి పాలైంది. ధ్రువ్ జురేల్, సంజుశాంసన్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శుభమ్ దూబే, హిట్ మేయర్ చివరి వరకూ ప్రయత్నించారు.
READ MORE: Botsa Satyanarayana: విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రంగంలోకి మాజీ మంత్రి
Also Read
287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. షమి వేసిన తొలి ఓవర్లో 16 పరుగులు సాధించింది. సిమర్జీత్ సింగ్ బౌలింగ్లో అభినవ్ మనోహర్కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైశ్వాల్ (1) వెనుదిరిగాడు. కెప్టెన్ రియాన్పరాగ్ (4) కూడా సిమర్జీత్ సింగ్ చేతిలో ఔట్ అయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు సిమర్జీత్. మహమ్మద్ షమీ చేతి బౌలింగ్లో నితీశ్ రాణా (11) పెవిలియన్కు చేరుకున్నాడు. అనంతరం ధ్రువ్ జురేల్, సంజుశాంసన్ మంచి భాగస్వామ్యం కొనసాగించారు. రాజస్థాన్ రాయల్స్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. హర్షల్పటేల్ బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి సంజు శాంసన్ (66) పెవిలియన్ బాటపట్టాడు. ఆడం జంపా బౌలింగ్లో ధ్రువ్ జురేల్ (70) ఔట్ అయ్యాడు. శుభమ్ దూబే (34), హిట్ మేయర్ (42) అద్భుతంగా రాణించిన ఫలితం లేకుండా పోయింది.
READ MORE: Ajay Ghosh : ఇండియాలో ఆ పార్టీలన్నీ ఏకం కావాలి : నటుడు అజయ్ ఘోష్
ఫస్ట్ ఇన్నింగ్స్లో..
హైదరాబాద్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (67), ఇషాన్ కిషన్ (106) విధ్వంసం సృష్టించారు. హెడ్ 21 బంతుల్లో అర్ధ శతకం అందుకోగా.. ఇషాన్ 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ (34), నితీశ్ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ (24) కూడా క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 3, మహీశ్ తీక్షణ 2, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
READ MORE: Botsa Satyanarayana: విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రంగంలోకి మాజీ మంత్రి
మరోవైపు.. సిమర్జీత్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ(1), ఆడమ్ జంపా(1), హర్షల్ పటేల్ (2) చొప్పున వికెట్లు తీశారు. కాగా.. ఈ మ్యాచ్ కొత్త రికార్డు నమోదైంది. సన్రైజర్స్ చేసిన 286 పరుగులు ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు. ఐపీఎల్లో అత్యధిక స్కోరు కూడా ఎస్ఆర్హెచ్దే. గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆ జట్టు మూడు వికెట్లకు 287 పరుగులు చేసింది. మరోసారి తన రికార్డును తీనే బద్దలు గొట్టింది సన్రైజర్స్ హైదరాబాద్..
READ MORE: Botsa Satyanarayana: విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రంగంలోకి మాజీ మంత్రి
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!