SRH vs RR: సొంత గడ్డపై సన్రైజర్స్ ఘన విజయం.. ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. తొలి మ్యాచ్ ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఆరు వికెట్లకు 286 పరుగులు చేసింది. 287 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 242 పరుగులకే పరిమితమైంది. 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి ఓటమి పాలైంది. ధ్రువ్ జురేల్, సంజుశాంసన్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శుభమ్ దూబే, హిట్ మేయర్ చివరి వరకూ ప్రయత్నించారు.
READ MORE: Botsa Satyanarayana: విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రంగంలోకి మాజీ మంత్రి
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. షమి వేసిన తొలి ఓవర్లో 16 పరుగులు సాధించింది. సిమర్జీత్ సింగ్ బౌలింగ్లో అభినవ్ మనోహర్కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైశ్వాల్ (1) వెనుదిరిగాడు. కెప్టెన్ రియాన్పరాగ్ (4) కూడా సిమర్జీత్ సింగ్ చేతిలో ఔట్ అయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు సిమర్జీత్. మహమ్మద్ షమీ చేతి బౌలింగ్లో నితీశ్ రాణా (11) పెవిలియన్కు చేరుకున్నాడు. అనంతరం ధ్రువ్ జురేల్, సంజుశాంసన్ మంచి భాగస్వామ్యం కొనసాగించారు. రాజస్థాన్ రాయల్స్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. హర్షల్పటేల్ బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి సంజు శాంసన్ (66) పెవిలియన్ బాటపట్టాడు. ఆడం జంపా బౌలింగ్లో ధ్రువ్ జురేల్ (70) ఔట్ అయ్యాడు. శుభమ్ దూబే (34), హిట్ మేయర్ (42) అద్భుతంగా రాణించిన ఫలితం లేకుండా పోయింది.
READ MORE: Ajay Ghosh : ఇండియాలో ఆ పార్టీలన్నీ ఏకం కావాలి : నటుడు అజయ్ ఘోష్
ఫస్ట్ ఇన్నింగ్స్లో..
హైదరాబాద్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (67), ఇషాన్ కిషన్ (106) విధ్వంసం సృష్టించారు. హెడ్ 21 బంతుల్లో అర్ధ శతకం అందుకోగా.. ఇషాన్ 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ (34), నితీశ్ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ (24) కూడా క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 3, మహీశ్ తీక్షణ 2, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
READ MORE: Botsa Satyanarayana: విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రంగంలోకి మాజీ మంత్రి
మరోవైపు.. సిమర్జీత్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ(1), ఆడమ్ జంపా(1), హర్షల్ పటేల్ (2) చొప్పున వికెట్లు తీశారు. కాగా.. ఈ మ్యాచ్ కొత్త రికార్డు నమోదైంది. సన్రైజర్స్ చేసిన 286 పరుగులు ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు. ఐపీఎల్లో అత్యధిక స్కోరు కూడా ఎస్ఆర్హెచ్దే. గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆ జట్టు మూడు వికెట్లకు 287 పరుగులు చేసింది. మరోసారి తన రికార్డును తీనే బద్దలు గొట్టింది సన్రైజర్స్ హైదరాబాద్..
READ MORE: Botsa Satyanarayana: విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రంగంలోకి మాజీ మంత్రి
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!