Sunita Williams: కాసేపట్లో అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్.. ముచ్చటగా మూడోసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunita Williams: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్లైనర్ స్పేస్షిప్లో నేడు స్పేస్లోకి దూసుకెళ్లనున్నారు. ఇంతకు ముందు బోయింగ్ కంపెనీ మానవ రహిత ప్రయోగాలు చేపట్టగా.. తొలిసారిగా మానవ సహిత యాత్ర చేపడుతున్నది. స్టార్లైనర్ స్పేస్షిప్ మంగళవారం ఉదయం 8.04 గంటలకు కెన్నడీ స్పేస్సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. 58 ఏళ్ల సునీతా విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ కూడా అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. అంతరిక్ష యాత్ర ప్రారంభించే ముందు సునీత మాట్లాడుతూ.. ఈ క్షణం కోసమే తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకోగానే ఇంటికి తిరిగి వచ్చినట్లుగా ఉంటుందని చెప్పారు.
Read Also: Lok Sabha Elections 2024: నేడే మూడో దశ.. 93 స్థానాల్లో పోలింగ్.. బరిలో అమిత్ షా, సింధియా
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
మే 15న భూమికి తిరిగి వచ్చే ముందు వారిద్దరూ ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడపనున్నారు. 4.56 మీటర్ల వ్యాసం కలిగిన ఈ వ్యోమనౌక మొత్తం నలుగురు వ్యోమగాములను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. విలియమ్స్ బీబీసీతో మాట్లాడుతూ.. మేమంతా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ప్రయాణంలో భాగస్వాములైనందుకు మా కుటుంబం, స్నేహితులు సంతోషంగా, గర్వంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఆమె గతంలో 2006, 2012లో అంతరిక్షంలోకి వెళ్లి మొత్తం 322 రోజులు గడిపారు. ఆమె 50 గంటల 40 నిమిషాల ఏడు అంతరిక్ష నడకలతో మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించింది. ఆమె అంతరిక్ష ప్రయాణంలో తనతో పాటు గణేశుడి విగ్రహం, ఉపనిషత్తులతో పాటు సమోసాలను తీసుకువెళ్లడం విశేషం. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ దానిని బద్దలు కొట్టింది. ఈ మిషన్ విజయవంతమైతే ఎలోన్ మస్క్ స్పేస్ఎక్స్ తర్వాత అంతరిక్షం కోసం సిబ్బంది కార్యకలాపాల సౌకర్యాలను అందించే రెండవ ప్రైవేట్ సంస్థ అవుతుంది.
సునీత అమెరికాలోని ఓహియోలోని యూక్లిడ్లో భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, బోనీ పాండ్యా దంపతులకు జన్మించింది. దీపక్ పాండ్యా గుజరాత్లోని మెహసానా నుంచి అమెరికాకు వెళ్లారు. సునీత 1987లో యూఎస్ నేవీలో నియమితులయ్యారు. దీని తర్వాత, అతను 1988లో వ్యోమగామిగా నాసాలో ఎంపికయ్యారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!