Ajit Pawar Wife Oath Ceremony: నేడే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం.. శాఖలు ఇవే..?
- నేడే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం..
- మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్..
- ఈరోజు ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకురాలిగా సునేత్రాను ఎన్నుకునే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar Wife Oath Ceremony: మహారాష్ట్ర దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ తొలి మహిళా డిప్యూటీ సీఎం కానున్నారు. ఆమె ఈరోజు ( జనవరి 31న) ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉందని ఎన్సీపీ (అజిత్) పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక, సునేత్రాకు ఎక్సైజ్, క్రీడల శాఖలను కేటాయించనున్నట్లు తెలుస్తుంది. కాగా, ముంబైలో ఇవాళ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై సునేత్రను శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకునే ఛాన్స్ ఉందని ఎన్సీపీ నేత ఒకరు తెలిపారు. సాయంత్రం వరకు ఆమె ఉపముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేస్తారని పేర్కొన్నారు.
Read Also: Tragic Incident in Jangareddygudem: గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
అయితే, అజిత్ పవార్ ఆకస్మిక మృతి నేపథ్యంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీలిక వర్గాల పునరేకీకరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. చీలిక వర్గాల కలయికకు కసరత్తు కొనసాగుతున్న విషయం నిజమేనని, ఇందుకు సంబంధించి అజిత్ పవార్ జీవించి ఉండగానే జరిగిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పుణె, చించ్వాడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరు వర్గాలు కలిసి పోటీ కూడా చేసేశాయి. రెండు చీలిక వర్గాలను విలీనం చేయాలని గత కొంతకాలంగా అజిత్ పవార్ తన బాబాయి శరద్ పవార్తో అనేక సార్లు సమావేశం అయ్యారని సమాచారం. శరద్ పవార్ వర్గానికి చెందిన సుప్రియా సూలే, జయంత్ పాటిల్తో కూడా చర్చలు కొనసాగించారు. బీజేపీ సీనియర్ నేతలకు ఈ విషయం తెలుసని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Off The Record: ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చగా మారిందా..?
ఇక, ఎన్సీపీ చీలిక వర్గాల పునరేకీకరణ జరిగితే వ్యవస్థాపక నాయకుడైన శరద్ పవార్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టి.. పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తే పునరేకీకరణ ప్రయత్నాలకు మళ్లీ విఘాతం కలుగుతుందా?.. అప్పుడు విలీనం కోరుకుంటున్న నాయకుల వైఖరి ఎలా ఉంటుంది? అనేది వేచి చూడాలి.. సునేత్రా పవార్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడానికి ఎలాంటి అడ్డంకులూ లేవని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించిన అజిత్ పవార్ చనిపోయిన నేపథ్యంలో వచ్చే నెల శాసనసభ సమావేశాల్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 2026-27 బడ్జెట్ సమర్పించే ఛాన్స్ ఉంది.
- Tags
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!