Tragic Incident in Jangareddygudem: గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి..
- గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి..
- జంగారెడ్డిగూడెంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragic Incident in Jangareddygudem: జంగారెడ్డిగూడెం పట్టణంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గొంతులో అన్నం ముద్ద అడ్డుపడటంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మార్కండేయ పురానికి చెందిన ర్యాలీ జెస్సి దివానా (2) అనే చిన్నారి మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో తల్లి భాను శిరీష, నానమ్మ వెంకటరమణ పనిమీద బయటికి వెళ్లారు. ఈ సమయంలో తండ్రి ఆంజనేయులు కుమార్ చిన్నారికి ముద్దపప్పు అన్నం కలిపి తినిపిస్తున్నాడు.
Read Also: Off The Record: ఐదేళ్ల పాటు ఆ ఎమ్మెల్సీ ఆడిందే ఆట.. పాడిందే పాట.. ఇప్పుడు ఆయన ఆచూకీ లేదు..
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
అయితే, అన్నం తినే క్రమంలో అకస్మాత్తుగా అన్నం ముద్ద గొంతులో అడ్డుపడటంతో చిన్నారి ఊపిరాడక ఇబ్బంది పడింది. ఒక్కసారిగా బిక్కిరి అయి స్పృహ కోల్పోయిన చిన్నారిని గమనించిన తండ్రి వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి మృతి వార్త విని బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఇంటికి చేరుకున్నారు. ఇంత చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. చిన్నారులకు ఆహారం తినిపించే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ముద్దగా, పెద్ద ముక్కలుగా ఆహారం తినిపించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ విషాద ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి