Sugar Production : చక్కెర ఉత్పత్తిలో 11 శాతం క్షీణత.. ధరల పెరుగుదల నియంత్రణకు ప్రభుత్వ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Production : చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ దేశం భారత్. ప్రస్తుతం దేశంలో చక్కెర ఉత్పత్తికి సంబంధించి వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల దేశంలో చక్కెర రేట్లు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తక్కువ చక్కెర ఉత్పత్తి కారణంగా భవిష్యత్తులో మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 15 వరకు భారతదేశంలో చక్కెర ఉత్పత్తి 11 శాతం తగ్గి 74.05 లక్షల టన్నులకు చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన ఈ క్షీణత కనిపించింది. గతేడాది ఇదే కాలంలో చక్కెర ఉత్పత్తి 82.95 లక్షల టన్నులుగా నమోదైంది.
చక్కెర ఉత్పత్తి తగ్గడానికి కారణాలు
ఈ ఏడాది మహారాష్ట్ర, కర్నాటకలో ఉత్పత్తి తక్కువగా ఉండడమే దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణమని పరిశ్రమల సంస్థ ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) వెల్లడించింది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రకటన ప్రకారం.. 2023-24 చక్కెర మార్కెటింగ్ సంవత్సరంలో డిసెంబర్ 15 వరకు, చక్కెర ఉత్పత్తి 74.05 లక్షల టన్నులుగా ఉంది, ఇది గత సంవత్సరం కంటే 8.9 లక్షల టన్నులు తక్కువ.
Also Read
- Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
Read Also:Warangal Corona: కరోనా కొత్త వేరియంట్.. వరంగల్ ఎంజీఎంలో స్పెషల్ వార్డు
మహారాష్ట్ర, కర్ణాటక చక్కెర మిల్లుల్లో పనులు ఆలస్యం
ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం.. 497 ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం మహారాష్ట్ర, కర్ణాటకలోని చక్కెర కర్మాగారాల్లో గత సంవత్సరం కంటే 10-15 రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభమయ్యాయి. చక్కెర సంవత్సరంలో అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు మహారాష్ట్రలో చక్కెర ఉత్పత్తి 33.02 లక్షల టన్నుల నుంచి 24.45 లక్షల టన్నులకు తగ్గింది. కర్ణాటకలో ఉత్పత్తి 19.20 లక్షల టన్నుల నుంచి 16.95 లక్షల టన్నులకు తగ్గింది.
యూపీలో పెరిగిన చక్కెర ఉత్పత్తి
2023-24 చక్కెర ఉత్పత్తి మార్కెటింగ్ అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 15 వరకు ఉత్తరప్రదేశ్లో చక్కెర ఉత్పత్తి 22.11 లక్షల టన్నులకు పెరిగింది. అయితే క్రితం సంవత్సరం ఇదే కాలంలో ఇది 20.26 లక్షల టన్నులు.
Read Also:Rakul Preet Singh : వామ్మో.. రకుల్ ఆ డ్రెస్సు ఏంటి..? ఇలా చూస్తే కుర్రాళ్లకు పండగే..
చక్కెర ఎగుమతులపై నిషేధం
2023-24 మార్కెటింగ్ సంవత్సరంలో మొత్తం చక్కెర ఉత్పత్తి 325 లక్షల టన్నులు (ఇథనాల్ ఉపయోగించకుండా) ఉంటుందని ISMA గత వారం అంచనా వేసింది. దేశంలో 56 లక్షల టన్నుల నిల్వ ఉంది. వినియోగం 285 లక్షల టన్నులుగా అంచనా వేయబడింది. దేశీయ సరఫరాను పెంచడానికి, ధరలను నియంత్రించడానికి ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతిని ప్రభుత్వం అనుమతించలేదు. 2022-23 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశం 64 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
-
SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!