Sugar Production : చక్కెర ఉత్పత్తిలో 11 శాతం క్షీణత.. ధరల పెరుగుదల నియంత్రణకు ప్రభుత్వ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Production : చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ దేశం భారత్. ప్రస్తుతం దేశంలో చక్కెర ఉత్పత్తికి సంబంధించి వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల దేశంలో చక్కెర రేట్లు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తక్కువ చక్కెర ఉత్పత్తి కారణంగా భవిష్యత్తులో మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 15 వరకు భారతదేశంలో చక్కెర ఉత్పత్తి 11 శాతం తగ్గి 74.05 లక్షల టన్నులకు చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన ఈ క్షీణత కనిపించింది. గతేడాది ఇదే కాలంలో చక్కెర ఉత్పత్తి 82.95 లక్షల టన్నులుగా నమోదైంది.
చక్కెర ఉత్పత్తి తగ్గడానికి కారణాలు
ఈ ఏడాది మహారాష్ట్ర, కర్నాటకలో ఉత్పత్తి తక్కువగా ఉండడమే దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణమని పరిశ్రమల సంస్థ ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) వెల్లడించింది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రకటన ప్రకారం.. 2023-24 చక్కెర మార్కెటింగ్ సంవత్సరంలో డిసెంబర్ 15 వరకు, చక్కెర ఉత్పత్తి 74.05 లక్షల టన్నులుగా ఉంది, ఇది గత సంవత్సరం కంటే 8.9 లక్షల టన్నులు తక్కువ.
Also Read
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
Read Also:Warangal Corona: కరోనా కొత్త వేరియంట్.. వరంగల్ ఎంజీఎంలో స్పెషల్ వార్డు
మహారాష్ట్ర, కర్ణాటక చక్కెర మిల్లుల్లో పనులు ఆలస్యం
ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం.. 497 ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం మహారాష్ట్ర, కర్ణాటకలోని చక్కెర కర్మాగారాల్లో గత సంవత్సరం కంటే 10-15 రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభమయ్యాయి. చక్కెర సంవత్సరంలో అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు మహారాష్ట్రలో చక్కెర ఉత్పత్తి 33.02 లక్షల టన్నుల నుంచి 24.45 లక్షల టన్నులకు తగ్గింది. కర్ణాటకలో ఉత్పత్తి 19.20 లక్షల టన్నుల నుంచి 16.95 లక్షల టన్నులకు తగ్గింది.
యూపీలో పెరిగిన చక్కెర ఉత్పత్తి
2023-24 చక్కెర ఉత్పత్తి మార్కెటింగ్ అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 15 వరకు ఉత్తరప్రదేశ్లో చక్కెర ఉత్పత్తి 22.11 లక్షల టన్నులకు పెరిగింది. అయితే క్రితం సంవత్సరం ఇదే కాలంలో ఇది 20.26 లక్షల టన్నులు.
Read Also:Rakul Preet Singh : వామ్మో.. రకుల్ ఆ డ్రెస్సు ఏంటి..? ఇలా చూస్తే కుర్రాళ్లకు పండగే..
చక్కెర ఎగుమతులపై నిషేధం
2023-24 మార్కెటింగ్ సంవత్సరంలో మొత్తం చక్కెర ఉత్పత్తి 325 లక్షల టన్నులు (ఇథనాల్ ఉపయోగించకుండా) ఉంటుందని ISMA గత వారం అంచనా వేసింది. దేశంలో 56 లక్షల టన్నుల నిల్వ ఉంది. వినియోగం 285 లక్షల టన్నులుగా అంచనా వేయబడింది. దేశీయ సరఫరాను పెంచడానికి, ధరలను నియంత్రించడానికి ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతిని ప్రభుత్వం అనుమతించలేదు. 2022-23 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశం 64 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది.
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..