Sugar Production : చక్కెర ఉత్పత్తిలో 11 శాతం క్షీణత.. ధరల పెరుగుదల నియంత్రణకు ప్రభుత్వ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Production : చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ దేశం భారత్. ప్రస్తుతం దేశంలో చక్కెర ఉత్పత్తికి సంబంధించి వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల దేశంలో చక్కెర రేట్లు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తక్కువ చక్కెర ఉత్పత్తి కారణంగా భవిష్యత్తులో మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 15 వరకు భారతదేశంలో చక్కెర ఉత్పత్తి 11 శాతం తగ్గి 74.05 లక్షల టన్నులకు చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన ఈ క్షీణత కనిపించింది. గతేడాది ఇదే కాలంలో చక్కెర ఉత్పత్తి 82.95 లక్షల టన్నులుగా నమోదైంది.
చక్కెర ఉత్పత్తి తగ్గడానికి కారణాలు
ఈ ఏడాది మహారాష్ట్ర, కర్నాటకలో ఉత్పత్తి తక్కువగా ఉండడమే దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణమని పరిశ్రమల సంస్థ ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) వెల్లడించింది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రకటన ప్రకారం.. 2023-24 చక్కెర మార్కెటింగ్ సంవత్సరంలో డిసెంబర్ 15 వరకు, చక్కెర ఉత్పత్తి 74.05 లక్షల టన్నులుగా ఉంది, ఇది గత సంవత్సరం కంటే 8.9 లక్షల టన్నులు తక్కువ.
Also Read
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
Read Also:Warangal Corona: కరోనా కొత్త వేరియంట్.. వరంగల్ ఎంజీఎంలో స్పెషల్ వార్డు
మహారాష్ట్ర, కర్ణాటక చక్కెర మిల్లుల్లో పనులు ఆలస్యం
ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం.. 497 ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం మహారాష్ట్ర, కర్ణాటకలోని చక్కెర కర్మాగారాల్లో గత సంవత్సరం కంటే 10-15 రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభమయ్యాయి. చక్కెర సంవత్సరంలో అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు మహారాష్ట్రలో చక్కెర ఉత్పత్తి 33.02 లక్షల టన్నుల నుంచి 24.45 లక్షల టన్నులకు తగ్గింది. కర్ణాటకలో ఉత్పత్తి 19.20 లక్షల టన్నుల నుంచి 16.95 లక్షల టన్నులకు తగ్గింది.
యూపీలో పెరిగిన చక్కెర ఉత్పత్తి
2023-24 చక్కెర ఉత్పత్తి మార్కెటింగ్ అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 15 వరకు ఉత్తరప్రదేశ్లో చక్కెర ఉత్పత్తి 22.11 లక్షల టన్నులకు పెరిగింది. అయితే క్రితం సంవత్సరం ఇదే కాలంలో ఇది 20.26 లక్షల టన్నులు.
Read Also:Rakul Preet Singh : వామ్మో.. రకుల్ ఆ డ్రెస్సు ఏంటి..? ఇలా చూస్తే కుర్రాళ్లకు పండగే..
చక్కెర ఎగుమతులపై నిషేధం
2023-24 మార్కెటింగ్ సంవత్సరంలో మొత్తం చక్కెర ఉత్పత్తి 325 లక్షల టన్నులు (ఇథనాల్ ఉపయోగించకుండా) ఉంటుందని ISMA గత వారం అంచనా వేసింది. దేశంలో 56 లక్షల టన్నుల నిల్వ ఉంది. వినియోగం 285 లక్షల టన్నులుగా అంచనా వేయబడింది. దేశీయ సరఫరాను పెంచడానికి, ధరలను నియంత్రించడానికి ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతిని ప్రభుత్వం అనుమతించలేదు. 2022-23 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశం 64 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?