Sugar Production : చక్కెర ఉత్పత్తిలో 11 శాతం క్షీణత.. ధరల పెరుగుదల నియంత్రణకు ప్రభుత్వ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Production : చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ దేశం భారత్. ప్రస్తుతం దేశంలో చక్కెర ఉత్పత్తికి సంబంధించి వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల దేశంలో చక్కెర రేట్లు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తక్కువ చక్కెర ఉత్పత్తి కారణంగా భవిష్యత్తులో మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 15 వరకు భారతదేశంలో చక్కెర ఉత్పత్తి 11 శాతం తగ్గి 74.05 లక్షల టన్నులకు చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన ఈ క్షీణత కనిపించింది. గతేడాది ఇదే కాలంలో చక్కెర ఉత్పత్తి 82.95 లక్షల టన్నులుగా నమోదైంది.
చక్కెర ఉత్పత్తి తగ్గడానికి కారణాలు
ఈ ఏడాది మహారాష్ట్ర, కర్నాటకలో ఉత్పత్తి తక్కువగా ఉండడమే దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణమని పరిశ్రమల సంస్థ ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) వెల్లడించింది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రకటన ప్రకారం.. 2023-24 చక్కెర మార్కెటింగ్ సంవత్సరంలో డిసెంబర్ 15 వరకు, చక్కెర ఉత్పత్తి 74.05 లక్షల టన్నులుగా ఉంది, ఇది గత సంవత్సరం కంటే 8.9 లక్షల టన్నులు తక్కువ.
Also Read
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
Read Also:Warangal Corona: కరోనా కొత్త వేరియంట్.. వరంగల్ ఎంజీఎంలో స్పెషల్ వార్డు
మహారాష్ట్ర, కర్ణాటక చక్కెర మిల్లుల్లో పనులు ఆలస్యం
ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం.. 497 ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం మహారాష్ట్ర, కర్ణాటకలోని చక్కెర కర్మాగారాల్లో గత సంవత్సరం కంటే 10-15 రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభమయ్యాయి. చక్కెర సంవత్సరంలో అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు మహారాష్ట్రలో చక్కెర ఉత్పత్తి 33.02 లక్షల టన్నుల నుంచి 24.45 లక్షల టన్నులకు తగ్గింది. కర్ణాటకలో ఉత్పత్తి 19.20 లక్షల టన్నుల నుంచి 16.95 లక్షల టన్నులకు తగ్గింది.
యూపీలో పెరిగిన చక్కెర ఉత్పత్తి
2023-24 చక్కెర ఉత్పత్తి మార్కెటింగ్ అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 15 వరకు ఉత్తరప్రదేశ్లో చక్కెర ఉత్పత్తి 22.11 లక్షల టన్నులకు పెరిగింది. అయితే క్రితం సంవత్సరం ఇదే కాలంలో ఇది 20.26 లక్షల టన్నులు.
Read Also:Rakul Preet Singh : వామ్మో.. రకుల్ ఆ డ్రెస్సు ఏంటి..? ఇలా చూస్తే కుర్రాళ్లకు పండగే..
చక్కెర ఎగుమతులపై నిషేధం
2023-24 మార్కెటింగ్ సంవత్సరంలో మొత్తం చక్కెర ఉత్పత్తి 325 లక్షల టన్నులు (ఇథనాల్ ఉపయోగించకుండా) ఉంటుందని ISMA గత వారం అంచనా వేసింది. దేశంలో 56 లక్షల టన్నుల నిల్వ ఉంది. వినియోగం 285 లక్షల టన్నులుగా అంచనా వేయబడింది. దేశీయ సరఫరాను పెంచడానికి, ధరలను నియంత్రించడానికి ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతిని ప్రభుత్వం అనుమతించలేదు. 2022-23 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశం 64 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది.
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!