Sudan War: సూడాన్ రక్తపాతం.. ఆ ముస్లిం దేశం యువరాజులపై తీవ్రమైన ఆరోపణలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudan War: సూడాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం మధ్య తాజాగా ఒక పెద్ద వివాదం చెలరేగింది. ఈ రక్తపాతానికి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇద్దరు సోదరులు షేక్ తహ్నౌన్, షేక్ మన్సూర్ కారణం అయ్యారంటూ అంతర్జాతీయ మీడియా ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను యూఏఈ తీవ్రంగా ఖండిస్తోంది. సూడాన్లో తమ మద్దతు ఏ పక్షానికి ఇవ్వడం లేదని యూఏఈ పేర్కొంది.
READ ALSO: Vidadala Rajini: వైసీపీకి గుడ్బైపై క్లారిటీ ఇచ్చిన విడదల రజిని..
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
నిజానికి సూడాన్లో పోరాటం చాలా తీవ్రంగా మారింది. ఇప్పటి వరకు సుమారుగా 150,000 మందికి పైగా మరణించారు, 12 మిలియన్లకు పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. ఐక్యరాజ్యసమితి దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభంగా అభివర్ణించింది. UAE లో అల్ నహ్యాన్ కుటుంబం అత్యంత ప్రభావవంతమైనదిగా చెబుతున్నారు. UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరు. ఆయనకు ఇద్దరు సోదరులు కూడా అత్యంత ప్రభావవంతమైన వారే. ఆయన మొదటి సోదరుడు షేక్ తహ్నౌన్, ఆఫ్రికాలో బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టే IHCకి జాతీయ భద్రతా సలహాదారు, ఛైర్మన్. ఆయన రెండవ సోదరుడు షేక్ మన్సూర్ మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ యజమాని. అలాగే అనేక మంది ఆఫ్రికన్ నాయకులకు చాలా సన్నిహితమైన వ్యక్తి. ఈ ముగ్గురు సోదరులు కలిసి UAEని ఆధునిక, శక్తివంతమైన పెట్టుబడి కేంద్రంగా నిర్మిస్తున్నారు. అయితే సూడాన్ యుద్ధం కచ్చితంగా వారి ఇమేజ్ గురించి ప్రశ్నలను లేవనెత్తిందని పలు నివేదికలు పేర్కొన్నాయి.
సూడాన్లో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న RSF (రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్) కు UAE ఆయుధాలను అందించిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే UAE మాత్రం సూడాన్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని, అక్కడ చెలరేగుతున్న హింసను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో RSF కమాండర్ హేమెద్తి, షేక్ మన్సూర్ గతంలో కలుసుకున్నారని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఆఫ్రికాలో IHC, ఇతర UAE కంపెనీలు వ్యవసాయం, మైనింగ్, ఓడరేవులు, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో పెట్టుబడులను వేగంగా పెంచాయి. దీనిని పలువురు విమర్శకులు కొత్త ఆర్థిక ఆధిపత్యం అని పిలుస్తున్నారు. అయితే UAE ఆఫ్రికాను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడమే తన లక్ష్యమని చెబుతోంది. యునైటెడ్ స్టేట్స్, యూరప్ రెండూ UAEని ఇంధనం, వాణిజ్యం, భద్రతకు కీలకమైనదిగా భావిస్తున్నాయి. టెక్, కృత్రిమ మేధస్సు రంగాలలో షేక్ తహ్నూన్కు ఉన్న బలమైన ప్రపంచ సంబంధాలు కూడా ఈ సమస్యపై పాశ్చాత్య దేశాల ప్రజల ప్రతిస్పందనను ప్రపంచానికి తెలియకుండా తగ్గించాయనే ఆరోపణలు ఉన్నాయి.
READ ALSO: Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ అంటున్న పవన్
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!