Earthquake: టర్కీలో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.6గా నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: మిడిల్ ఈస్ట్ దేశం టర్కియేలో బలమైన భూకంపం సంభవించింది. సెంట్రల్ టర్కియేలో గురువారం ఒక మోస్తరు తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు రాలేదు. డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ ప్రకారం.. రాజధాని అంకారాకు తూర్పున 450 కిలోమీటర్లు (280 మైళ్ళు) దూరంలో ఉన్న టోకట్ ప్రావిన్స్లోని సులుసరాయ్ నగరంలో భూకంపం సంభవించింది.
భూకంపం రావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే, అంతకుముందు టర్కీలో సంభవించిన భూకంపాలలో, మరణించిన వారి సంఖ్య వెయ్యికి పైగా చేరుకుంది. అంతకుముందు కూడా ఫిబ్రవరి 2023లో టర్కీలో సంభవించిన భూకంపం కారణంగా అనేక వేల మంది చనిపోయారు.
Also Read
గత ఏడాది 20 ఏళ్లలో టర్కీని తాకిన అత్యంత విధ్వంసకర భూకంపంగా గత ఏడాది సంభవించిన భూకంపం నిరూపించబడింది. ఫిబ్రవరి 6న సిరియాతో ఉత్తర సరిహద్దు సమీపంలోని దక్షిణ టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించిన తొమ్మిది గంటల తర్వాత, నైరుతి దిశలో 95 కిలోమీటర్ల దూరంలో 7.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.
ఈ రెండో షాక్లో వందలాది భవనాలు పేకముక్కల్లా చెల్లాచెదురుగా పడ్డాయి. ఇలాంటి భూకంప ప్రకంపనలు మొదటిసారిగా 1939లో సంభవించాయి. ఈ షాక్లో దాదాపు 33 వేల మంది చనిపోయారు. భూకంపం బలమైన ప్రకంపనలను అనుభవించిన తరువాత ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావడం ప్రారంభించారని టర్కీ స్థానిక ప్రజలు తెలిపారు. గందరగోళ వాతావరణం ఏర్పడింది. ప్రకంపనలు వచ్చిన తర్వాత ఏదైనా భవనం కూలిపోతుందేమోనని భయపడ్డామని ప్రజలు చెబుతున్నారు.
Read Also:Story Board: తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధం.. బరిలో కీలక నేతలు
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!