Lok Sabha Electioms 2024: నేడే తొలి విడత పోలింగ్.. 102 ఎంపీ స్థానాలకు ఎన్నికలు.. బరిలో ఉన్న కీలక వ్యక్తులు వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Electioms 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ జరగబోతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటలకు తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. తమిళనాడులోని మొత్తం 39 ఎంపీ స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తుంటే, ఈ సారి ఎలాగైనా ప్రధాని మోడీని గద్దె దించాలని ఇండియా కూటమి భావిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటాలని అనుకుంటోంది.
మొదటి దశలో, తమిళనాడు 39, ఉత్తరాఖండ్ 5, అరుణాచల్ ప్రదేశ్ 2, మేఘాలయ 2, అండమాన్ మరియు నికోబార్ దీవులు 1, మిజోరం 1, నాగాలాండ్ 1, పుదుచ్చేరి 1, సిక్కిం 1 మరియు లక్షద్వీప్ 1 ఎంపీ స్థానాలతో పాటు రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, మహారాష్ట్రలో 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్లో 2, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. వీటిలో పాటు అరుణాచల్ ప్రదేశ్ (60 సీట్లు), సిక్కిం (32 సీట్లు)లో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Read Also: MI v PBKS: ముంబై బౌలర్ల జోరు.. బెంబెలేత్తిపోయిన పంజాబ్ బ్యాటర్లు
మొదటి దశలో 16.63 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 35.67 లక్షల మంది తొలిసారి ఓటుసారి ఓటర్లు ఉన్నారు. 20-29 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 3.51 కోట్ల మంది యువ ఓటర్లు, 11,371 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు. వీరంతా 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
తొలి దశలో పోటీ చేస్తున్న కీలక నేతల్లో నితిన్ గడ్కరీ, సర్బానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్, కిరెన్ రిజిజు, సంజీవ్ బలియన్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘవాల్, ఎల్ మురుగన్ మరియు నిసిత్ ప్రమాణిక్ వంటి ఏడుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరితో పాటు కోయంబత్తూర్ నుంచి తమిళనాడు బీజేపీ ఛీప్ అన్నామలై కూడా పోటీ చేస్తున్నారు. చెన్నై నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, డీఎంకే నుంచి కనిమెళి, కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగోయ్ పోటీో ఉన్నారు.
2019 ఎన్నికలను పరిశీలిస్తే ఈ రోజు జరగబోతున్న 102 స్థానాల్లో ఎన్డీయే 41 స్థానాలను గెలుచుకోగా.. యూపీఏ కూటమి 45 సీట్లను సాధించుకుంది. ఎన్నికల నిర్వహణ కోసం 102 స్థానాల్లో 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లు, 18 లక్షల పోలింగ్ సిబ్బందిని మోహరించారు. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!