Stray Dogs Attack: వీధి కుక్కల స్వైర విహారం.. కనిపించిన వారినల్లా కరుస్తూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stray Dogs Attack: హైదరాబాద్ పరిధిలో కుక్కల దాడులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల అంబర్ పేటలో బాలుడి మృతి ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. కంటికి కనిపించిన వారిని కరుస్తూ ఆస్పత్రి పాలు చేస్తున్నాయి వీధి కుక్కలు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా పీర్జాధి గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బుద్దా నగర్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి భూపాల్ రెడ్డిపై వీధి కుక్కల దాడి చేశాయి.
రాజేంద్రనగర్ అత్తాపూర్లో మరోసారి వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న 2 సంవత్సరాల బాలుడి పై దాడి చేశాయి. విచక్షణారహితంగా కరచాయి. దీంతో కుక్కలను తరిమి కొట్టి బాలుడిని కాపాడిన స్థానికులు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
పీర్జాధిగూడ 11వ డివిజన్ బుద్ధనగర్ లో వాకింగ్ కి వెళ్లి వస్తున్న భూపాల్ రెడ్డిపై వీది కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆయన ఫీవర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆయన తన నివాసానికి చేరుకున్నారు. గతంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పలు మార్లు చిన్నారులపై కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు చేసాయి. కానీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ, పాలక వర్గం కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తారని, కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. కుక్క కాటు బాధితుడు భూపాల్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. అధికారులు, పాలక వర్గం త్వరగా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
Read Also: Uttar Pradesh: ఎద్దు బీభత్సం.. 4 ఏళ్ల చిన్నారికి గాయం
కాగా, అంబర్పేటలో నాలుగేళ్ల బాలుడిపై కుక్కల దాడి ఘటన తర్వాత.. జీహెచ్ఎంసీ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద పెరిగింది. అయితే, వాటిని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించాలని పలు కాలనీ వాసులు కోరుతున్నారు. కుక్కల జనాభా నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అయితే, కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు.
తాజావార్తలు
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!