Delhi: జమిలిపై జమ్మూకాశ్మీర్ పార్టీల విధానం ఇదే!
వన్ నేషన్-వన్ ఎలక్షన్కు జమ్మూకాశ్మీర్ పార్టీలు మద్దతు తెలిపాయి. జమిలి ఎన్నికలను జమ్మూకాశ్మీర్తోనే ప్రారంభించాలని పార్టీలు కోరాయి. దాదాపు ఆరేళ్ల నుంచి రాష్ట్రంలో ఎన్నికలు జరగడం లేదని.. రాష్ట్రపతి పాలనలోనే కొనసాగుతున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ముందు వాపోయాయి.
నేషనల్ కాన్ఫరెన్స్ , పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్, గులాం నబీ ఆజాద్ యొక్క డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీలు జమ్మూ కాశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని ఈసీని కోరాయి. రాష్ట్రపతి పాలనలో ఉన్నామని… ఆరేళ్లుగా రాష్ట్రంలో ఎన్నికలు లేవని తెలిపాయి.
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
త్వరలోనే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జమ్మూకాశ్మీర్లో పర్యటించింది. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని పార్టీలు కోరాయి. మరోవైపు సోమవారం భారత ఎన్నికల సంఘం.. పోల్ ప్యానెల్ బృందంతో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల నిర్వహణపై చర్చించారు.
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్ దాని ఆరు లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో జరగనున్నాయి. ఇక సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్ర హోదా పునరుద్ధరణలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తున్నారు.
జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నట్లు ఆజాద్ తెలిపారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలనే ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్లో భాగంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆజాద్ పార్లమెంట్కు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనంతనాగ్-రాజౌరీ పార్లమెంటరీ స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంది. ఈ స్థానం సాంప్రదాయకంగా మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందినది. మరీ ఆజాద్ పోటీ చేస్తారా? లేదంటే పార్టీ తరపున ప్రచారం చేస్తారో చూడాలి.
అనంత్నాగ్-రాజౌరీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడాన్ని తాను తోసిపుచ్చడం లేదని ఆజాద్ అన్నారు. చాలా మంది తనను పోటీ చేయమని అడుగుతున్నారన్నారు. తాను పార్లమెంటులో ఉండాలనే డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్లో ఎన్నికలను సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్రం ఇప్పటికే 600 పారామిలటరీ కంపెనీల మోహరింపు చేసింది. ఇక బీజేపీ ప్రతినిధి బృందం కూడా పోల్ ప్యానెల్ బృందాన్ని కలిసి.. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ఎన్నికల కమిషన్ విచక్షణకే తేదీల ప్రకటనను బీజేపీ వదిలేసింది.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!