Priests Dance: పూజారుల మందు పార్టీ.. అశ్లీల నృత్యాలతో రచ్చరచ్చ! వీడియోలు వైరల్
- మందు పార్టీ చేసుకున్న పూజారులు
- అశ్లీల నృత్యాలతో రచ్చరచ్చ చేసిన పూజారులు
- పూజారులపై పోలీసుల కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవిత్రమైన ఆచారాలను నిర్వహించే పూజారులే అసభ్యంగా ప్రవర్తించారు. ఆలయం ప్రాంగణంలోనే మందు పార్టీ చేసుకున్నారు. అంతేకాదు మద్యం మత్తులో అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. పూజారుల చేసుకున్న మందు పార్టీకి సంబందించిన వీడియోస్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఆలయ అధికారి ఫిర్యాదు మేరకు పూజారులపై కేసు నమోదు అయింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. భక్తులు మండిపడుతున్నారు.
విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులోని ప్రసిద్ధ పెరియ మరియమ్మన్ ఆలయంలో 28 ఏళ్ల తరువాత పవిత్ర కుంభాభిషేకం జరుగుతోంది. ఈ కుంభాభిషేకానికి వచ్చిన పూజారులు కొందరు.. గత రాత్రి మందు పార్టీ చేసుకున్నారు. తమిళ సినిమా పాటలతో అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. గతంలో ఆలయానికి వచ్చిన మహిళ భక్తులతో వీరు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. వీడియోలు వైరల్ కావడంతో.. ఐదుగురు అర్చకులను అధికారులు విధుల నుంచి తొలగించారు. ఇతర ఆలయ పూజ విషయాల్లో వారు జోక్యం చేసుకోకుండా నిషేధం విధించారు. పెరియ మరియమ్మన్ ఆలయ అధికారి ఫిర్యాదు మేరకు పూజారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
- ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం... 2027 వరల్డ్ కప్లో అసలు ఏం జరగబోతోంది..?
- Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
- CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
Also Read: Pawan Kalyan: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై పవన్ కల్యాణ్ ఛలోక్తులు!
విషయం తెలుసుకున్న అర్చకులు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అసిస్టెంట్ పూజారి గోమతి వినాయగం, తాత్కాలిక పూజారులు వినోద్, గణేషన్లను విధుల నుంచి తొలగించారు. మద్యం సేవించి అశ్లీల నృత్యం చేసిన తాత్కాలిక పూజారులు సహా మరో 3 మందిని తొలగించారు. కుంభాభిషేక వేడుకకు వచ్చిన కొంతమంది పూజారులు గోమతి వినాయగం ఇంట్లోనే బస చేస్తున్నారు. పూజారులు నృత్యం చేస్తున్న దృశ్యాలను ఆలయ మాజీ పూజారి హరిహరన్ కుమారుడు శబరినాథన్ వీడియో తీసి.. ఛారిటబుల్ ట్రస్ట్స్ శాఖ అధికారులకు, ఆలయ నిర్వహణ కమిటీకి ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
-
China: మళ్లీ కరోనా కలకలం.. చైనాలో 79 వేల కొత్త కేసులు.. భారత్కు డేంజరేనా?
-
ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం… 2027 వరల్డ్ కప్లో అసలు ఏం జరగబోతోంది..?
-
Plastic Notes: దేశ కరెన్సీ చరిత్రలో మరో కీలక మార్పు.. ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీకి రంగం సిద్ధం!
-
Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!