Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. పాదయాత్ర భక్తులకు ఈవో శుభవార్త!
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు
- ఏర్పాట్లపై స్పందించిన ఈవో శ్రీనివాసరావు
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు. ఏ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో శ్రీనివాసరావు స్పందించారు. భక్తులు సంతృప్తికరమైన సమాధానం అనుభవాన్ని పంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. దర్శనం విషయంలో క్యూలైన్స్లో ఒత్తిడి లేకుండా.. ఏ లైన్ దేనికి అనేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అటవీశాఖ సమన్వయంతో పాదయాత్ర భక్తులు నడిచే రహదారిని గ్రావెల్తో సరిచేస్తాం అని ఈవో పేర్కొన్నారు.
శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ… ‘భక్తులు సంతృప్తికరమైన సమాధానం అనుభవాన్ని పంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం. దర్శనం విషయంలో క్యూలైన్స్లో ఒత్తిడి లేకుండా ఏ లైన్ దేనికి అనేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. అటవీశాఖ సమన్వయంతో పాదయాత్ర భక్తులు నడిచే రహదారిని గ్రావెల్తో సరిచేస్తాం. పాదయాత్ర భక్తులకు మంచినీరు, చలువ పందిళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. అటవీ ప్రాంతంలో ఉన్న మంచినీరు త్రాగడానికి బాగుందా లేదా చూసి టాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తాం. ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు గత సంవత్సరం కంటే 15 శాతం ఏర్పాట్లు ఎక్కువగా చేస్తాం’ అని తెలిపారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
‘ఈనెల 31 లోపు ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యేలా చూసి.. మిగిలిన 19 రోజులు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే సరిచేస్తాం. ప్రతి శాఖతో సమన్వయం చేసుకునేందుకు ఇప్పటికే 54 లేఖలు ఆయా శాఖలకు పంపించాం. ఉత్సవాలలో ప్రధాన సమస్య భక్తులు వాడిపడేసిన చెప్పులు, బట్టలు పర్యావరణానికి ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డుకు తరలిస్తాము. శివరాత్రి బ్రహ్మోత్సవాలపై త్వరలో జిల్లా కలెక్టర్తో సమావేశం ఉంటుంది’ అని శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!