Srinivas Goud: మేం నిరక్షరాస్యులం కాదు.. మమ్మల్సి మోసం చేయలేరు!
- బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ గురించి మాకు తెలుసు
- నాడు స్వప్న రెడ్డితో కేసు వేయించి కొట్టి వేయించారు
- ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లకు జీవో ఎందుకు ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాము నిరక్షరాస్యులం ఏమీ కాదని.. బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ గురించి తెలుసు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పక్క రాష్టాల్లో రిజర్వేషన్లను న్యాయస్థానాలు కొట్టి వేసాయని, తమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం అవసరం అయితే కర్నాటక వెళ్లి సీఎం సిద్ధ రామయ్యతో చర్చిస్తాం అని పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లు జరుగుతున్నాయని.. మరి వాటికి బీసీ రిజర్వేషన్ల జీవో ఎందుకు ఇవ్వలేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ.. ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది.
Also Read: Ravindra Jadeja: హీరోనా లేదా విలనా?.. లార్డ్స్లో జడేజా ఇన్నింగ్స్పై దిగ్గజాలు ఏమన్నారంటే?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను ఒక బీసీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో చెప్పించారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అప్పుడు కాంగ్రెస్ నేతలు పెద్ద నాయకులతో చెప్పించారు. బీసీ రిజర్వేషన్ల కోసం అవసరం అయితే కర్నాటక వెళ్లి సిద్ధ రామయ్యతో చర్చిస్తాం. నాడు 33 శాతం రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తే.. స్వప్న రెడ్డితో కేసు వేయించి కొట్టి వేయించారు. మేము నిరక్షరాస్యులం కాదు.. బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ గురించి తెలుసు. పక్క రాష్టాల్లో రిజర్వేషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. మమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఖబడ్దార్. మీ మాటలతో పిచ్చి వాల్లను, హౌలా గాళ్లను చేయకండి. కేబినెట్లో యాదవ్, గొల్ల కురుమలకు స్థానం లేదు. ఒక జీవోతో రిజర్వేషన్లు ఇస్తామనడం మోసం. అలా ఒక జీవోతో రిజర్వేషన్లు వచ్చేది ఉంటే ఇన్ని ఉద్యమాలు, గొడవలు ఎందుకు అవుతున్నాయి. 42 శాతం రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పించకుంటే మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. వాటికి బీసీ రిజర్వేషన్ల జీవో ఎందుకు ఇవ్వలేదు’ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..