Srinivas Goud: మేం నిరక్షరాస్యులం కాదు.. మమ్మల్సి మోసం చేయలేరు!
- బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ గురించి మాకు తెలుసు
- నాడు స్వప్న రెడ్డితో కేసు వేయించి కొట్టి వేయించారు
- ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లకు జీవో ఎందుకు ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాము నిరక్షరాస్యులం ఏమీ కాదని.. బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ గురించి తెలుసు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పక్క రాష్టాల్లో రిజర్వేషన్లను న్యాయస్థానాలు కొట్టి వేసాయని, తమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం అవసరం అయితే కర్నాటక వెళ్లి సీఎం సిద్ధ రామయ్యతో చర్చిస్తాం అని పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లు జరుగుతున్నాయని.. మరి వాటికి బీసీ రిజర్వేషన్ల జీవో ఎందుకు ఇవ్వలేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ.. ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది.
Also Read: Ravindra Jadeja: హీరోనా లేదా విలనా?.. లార్డ్స్లో జడేజా ఇన్నింగ్స్పై దిగ్గజాలు ఏమన్నారంటే?
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను ఒక బీసీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో చెప్పించారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అప్పుడు కాంగ్రెస్ నేతలు పెద్ద నాయకులతో చెప్పించారు. బీసీ రిజర్వేషన్ల కోసం అవసరం అయితే కర్నాటక వెళ్లి సిద్ధ రామయ్యతో చర్చిస్తాం. నాడు 33 శాతం రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తే.. స్వప్న రెడ్డితో కేసు వేయించి కొట్టి వేయించారు. మేము నిరక్షరాస్యులం కాదు.. బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ గురించి తెలుసు. పక్క రాష్టాల్లో రిజర్వేషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. మమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఖబడ్దార్. మీ మాటలతో పిచ్చి వాల్లను, హౌలా గాళ్లను చేయకండి. కేబినెట్లో యాదవ్, గొల్ల కురుమలకు స్థానం లేదు. ఒక జీవోతో రిజర్వేషన్లు ఇస్తామనడం మోసం. అలా ఒక జీవోతో రిజర్వేషన్లు వచ్చేది ఉంటే ఇన్ని ఉద్యమాలు, గొడవలు ఎందుకు అవుతున్నాయి. 42 శాతం రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పించకుంటే మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. వాటికి బీసీ రిజర్వేషన్ల జీవో ఎందుకు ఇవ్వలేదు’ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..