Duddilla Sridhar Babbu : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రమాదకరంగా ఉంది
- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రమాదకరంగా ఉంది
- రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది
- అనుసరించాల్సిన సమైక్య న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రమాదకరంగా ఉందని, రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అనుసరించాల్సిన సమైక్య న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 అనుగుణంగా నిధుల కేటాయింపు జరగలేదని ఆయన మండిపడ్డారు. షెడ్యూల్ తొమ్మిది, పది అంశాలని పట్టించుకోలేదని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం కులమత బేదాలకు తావులేకుండా బడ్జెట్ ఉంటుందని చెప్పారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్లో ఒక్కసారి కూడా తెలంగాణ పదాన్ని పలకలేదని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 35 హామీలున్నవని ఆయన పేర్కొన్నారు. హామీల కోసం మేము చాలాసార్లు ప్రస్తావించామన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఏనాడు పోరాటం చేయలేదని, కానీ తెలంగాణను బడ్జెట్లో నిర్లక్ష్యం చేశారన్నారు. పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు కూడా ప్రాధాన్యత ఇస్తామని ఉందని, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎకనామిక్ గ్రోత్ ఉన్న రాష్ట్రమని ఆయన వెల్లడించారు.
Duddilla Sridhar Babbu : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రమాదకరంగా ఉంది
Also Read
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
- Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
అంతేకాకుండా.’ఇండస్ట్రియల్ కారిడార్ లో హైదరాబాద్ పేరు ఉంది. వాళ్ల నోడ్ లో ఇప్పుడు ఏపీలో ఉంది. ఏపీకి పునర్విభజన చట్టంలో భాగంగా నిధులు ఇస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ తమ ప్రభుత్వంలో భాగస్వాములు గా ఉన్నారు అందుకే వాళ్లకు నిధులు ఇస్తామనేది కరెక్ట్ కాదు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చిన్న చూపు చూస్తుంది. ఉరుముదయ పథకంలో ఏపీకి,బీహార్ కి న్యాయం చేస్తామనడం కరెక్ట్ కాదు. నీటి ప్రాజెక్టులో తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరితే ఆ ప్రస్తావని చేయలేదు. బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు. ప్రపంచ స్థాయిలో పేరొందిన టూరిజం ప్రాంతాలు తెలంగాణలో ఉన్నవి. వాటి ప్రస్తావనే లేదు. ఎన్డీయే గవర్నమెంట్ లో నీతి ఆయోగ్ ప్రవేశపెట్టి ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి విధులు, నిధులు హక్కులని తుంగలో తొక్కుతుంది. 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులని అనేకసార్లుగా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. కానీ దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఆర్టికల్ 275 ని కూడా పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణని ముందుకు తీసుకపోకపోతే వికసిత్ భారత్ కి సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రంలో అనేక వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి.’ అని శ్రీధర్ బాబు అన్నారు.
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!