Srilanka Crisis: దయచేసి వరి సాగు చేయండి.. రైతులను వేడుకుంటున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశ ఖజానాలో విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంది. అయితే దేశంలో ఆహార సంక్షోభం మరింత పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు వరిని సాగు చేయాలని ప్రభుత్వం వేడుకుంటోంది. ఇప్పటికే ఆహార సంక్షోభం తీవ్రంగా ఉందని.. మరో 50 శాతం ఉత్పత్తి తగ్గితే శ్రీలంక పరిస్థితులు మరింత తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శ్రీలంకలో ఏడు దశాబ్ధాలలో ఎప్పుడు లేనంతగా ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. 2.2 కోట్ల జనాభా ఉన్న చిన్న దేశం అనేక సమస్యలతో అల్లాడుతోంది. ఆహారం, ఇంధనం, మెడిసిన్స్ ఇలా కీలక దిగుమతుల కోసం డబ్బులు చెల్లించడానికి చిల్లిగవ్వ కూడా లేదు. వచ్చే ఐదు, పది రోజుల్లో రైతులంతా తమ పొలాల్లో అడుగుపెట్టి వరిని సాగు చేయాలని కోరుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అమరవీర మంగళవారం అన్నారు. ఇప్పటికే శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే రానున్న కాలంలో ఆహారం సంక్షోభం తీవ్రం అవుతుందని ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఎరువులను దిగుమతి చేసుకోవడానికి 600 మిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా వేశారు.రాబోయే రెండు సీజన్లలో వరి, తేయాకు, మొక్కజొన్నకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండే అవకాశం కూడా తక్కువగానే ఉంది.
Also Read
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
- Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
భారత్ నుంచి 65,000 టన్నుల ఎరువులను సేకరించేందుకు భారత్ తో చర్చలు జరుపుతున్నట్లు, మరో ఏడు దేశాలకు కోరుతున్నామని అమరవీర చెప్పారు. అయితే ఇవి ఎప్పుడు శ్రీలంకకు చేరుతాయో చెప్పలేమని ఆయన అన్నారు. ప్రస్తుతం శ్రీలంకలో కరెన్సీ విలువ 50 శాతం క్షీణించిది. ఆహార ద్రవ్యోల్భనం 46 శాతానికి చేరుకుంది.
తాజావార్తలు
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..