Special Train to Ayodhya: ఏపీ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు.. జెండా ఊపి ప్రారంభించిన పురంధేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Special Train to Ayodhya: ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్లో గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలును ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్య కుమార్, తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ నుండి అయోధ్యకు వెళుతున్న మొదటి రైలు ఇదేనని.. వేలాది మంది భక్తులను అయోధ్యకు పంపిస్తున్న పుణ్యం ఏపీకి దక్కుతుందన్నారు. శ్రీరాముని చల్లని చూపు ఏపీపై ఉండాలన్నారు. అయోధ్యలో రాముని చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం బీజేపీ కల అని.. దాన్ని నిజం చేసిన నాయకుడు ప్రధాని మోడీ అంటూ కొనియాడారు. ఎన్నో జన్మల పుణ్యఫలంతో ప్రధాని మోడీ ఈ ఆలయం నిర్మించగలిగారన్నారు. ఇదిలా ఉండగా.. పొత్తుల వ్యవహారం బీజేపీ అగ్రనాయకత్వం చూసుకుంటుందన్నారు. చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో మాకు తెలియదన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారనేది మీడియా చెబుతుంటే చూస్తున్నామన్నారు. ఎప్పుడు, ఎవరితో భేటీ అవ్వాలో పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో బీజేపీ అగ్రనాయకత్వం చూసుకుంటుందని ఆమె వెల్లడించారు.
Also Read
- Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారాలపై మాకు అవగాహన ఉండదు… అలాంటి విషయాలపై స్పందించడం సరికాదు, కొన్ని పరిమితులు ఉంటాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరే చూస్తారని ఆయన మీడియాతో వెల్లడించారు. తినబోతూ రుచి అడగవద్దన్నారు. జరుగుతున్న ప్రచారాలు చూస్తే , మూడు నాలుగు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుందన్నారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజా కంటక పాలన అంతం అవ్వాలి, ఆ నినాదంతోనే రాష్ట్ర బీజేపీ నాయకత్వం పనిచేస్తుందన్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!