Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Special Principal Secretary Of Finance Ramakrishna Rao Attended The Public Hearing Of The Kaleshwaram Commission

Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన రామకృష్ణారావు విచారణ..

Published Date :January 21, 2025 , 3:39 pm
By Rajesh Veeramalla
  • కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణరావు విచారణ
  • కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణారావు
  • కాళేశ్వరం కార్పొరేషన్ - లోన్స్ - ప్రాజెక్టు డిజైనులు, బడ్జెట్ కేటాయింపుల అంశాలపై ప్రశ్నలు
  • కార్పొరేషన్ కు నిధులు ఎలా సమకూర్చారని ప్రశ్నించిన కమిషన్.
Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన రామకృష్ణారావు విచారణ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాళేశ్వరం కమిషన్ ముందు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణరావు విచారణ ముగిసింది. కాళేశ్వరం కార్పొరేషన్ – లోన్స్ – ప్రాజెక్టు డిజైనులు, బడ్జెట్ కేటాయింపుల అంశాలపై కమిషన్ ప్రశ్నించింది. కార్పొరేషన్‌కు నిధులు ఎలా సమకూర్చారని ప్రశ్నించింది. కార్పొరేషన్ ద్వారా ఆదాయాన్ని ఎలా పొందుతారని రామకృష్ణరావును కమిషన్ క్వశ్చన్ చేసింది. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని రామకృష్ణ రావు కమిషన్‌కు చెప్పారు. డిజైన్లను అప్రూవల్ చేసే సమయంలో నిబంధనలు పాటించలేదని కమిషన్ పేర్కొంది.

Read Also: Auto Expo 2025 : మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పోలో జిమ్నీ ప్రదర్శన… భవిష్యతులో థార్ కు గట్టిపోటీ

కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం ఏంటి? ప్రాజెక్టు ద్వారా ఆదాయాన్ని ఎలా సమకూర్చారు ఎలా చేస్తారు..? అని కమిషన్ ప్రశ్నించింది. పరిశ్రమలకు నీళ్లు అమ్ముకోవడం, త్రాగునీటి వ్యాపారం చేయడంతో ఆదాయాన్ని అర్జిస్తామని రామకృష్ణ రావు కాళేశ్వరం కమిషన్‌కు చెప్పారు. ప్రతి ఏడాదికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రిన్సిపల్ అమౌంట్ రూ.7382 కోట్లు, ఈ ఏడాది 6519 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నామని రామకృష్ణారావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్స్‌కి 9నుంచి 10.5 శాతం వడ్డీతో రీ పేమెంట్ చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని రామకృష్ణ రావు కమిషన్ ముందు చెప్పారు.

Read Also: Adi Srinivas: నీ వల్ల సిరిసిల్లలో ఒక్క కార్మికుడి జీవితం కూడా మారలేదు.. కేటీఆర్ పై ఫైర్

మరోవైపు.. ప్రాజెక్ట్ తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదని కాళేశ్వరం కమిషన్ తెలిపింది. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫిజికల్ పాలసీ పెట్టలేదని రికార్డులను చూపించింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ప్రాపర్‌గా క్యాబినెట్ ముందుకు రాలేదని కమిషన్ తెలిపింది. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని పేర్కొంది. రామకృష్ణారావుకు నిబంధనలు పాటించని అంశాల రికార్డులను కమిషన్ చూపించింది. ఆర్థికపరమైన అంశాల్లో రికార్డులను మైంటైన్ చేయలేదని కమిషన్ తెలిపింది. ఈ క్రమంలో.. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గ్యారెంటీతోనే లోన్లు కార్పొరేషన్ తీసుకుందని రామకృష్ణరావు కాళేశ్వరం కమిషన్‌కు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎంత ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం నీటిని పరిశ్రమలకు విక్రయించడం ద్వారా రూ.7 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణ రావు తెలిపారు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 95 వేల కోట్ల పైచిలుకు డబ్బులు ఖర్చు చేసిందని కమిషన్‌కు బ్యూరోక్రాట్స్ గతంలో స్పష్టం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • finance
  • infrastructure
  • Irrigation
  • Kaleshwaram commission
  • Kaleshwaram Lift Irrigation Scheme

తాజావార్తలు

  • Governor Shiv Pratap Shukla: రైతు భరోసా నుంచి మహాలక్ష్మి వరకు.. సంక్షేమ పథకాలపై గవర్నర్ మార్క్ ప్రసంగం..!

  • Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం: సీఎం చంద్రబాబు

  • Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నారు: పవన్

  • Moinabad: ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన వివరాలు.!

  • Raashii Khanna: పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు కూడా పని చేశా

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions