MLA Disqualification Petitions: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కొనసాగుతున్న విచారణ నేటితో ముగియనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు తన ఛాంబర్లో కీలక విచారణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రెండు కీలక పిటిషన్లపై తుది వాదనలు వినిపించబడనున్నాయి. మొదటగా కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ విచారించనున్నారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ను వివేకానంద దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు వాదనలు వినిపించగా.. ఇవాళ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ను స్పీకర్ నమోదు చేయనున్నారు.
Fire Accident: టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.!
అనంతరం దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్ పై కూడా విచారణ కొనసాగనుంది. దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ను కౌశిక్ రెడ్డితో పాటు మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. ఈ కేసులోనూ ఇవాళ తుది వాదనలు వినిపించనున్నారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ పూర్తయ్యే నేపథ్యంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇవాళ్టితో విచారణ ముగియనుండగా, తదుపరి నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది.
SA vs NZ: ఫిన్ అలెన్ అజేయ సెంచరీ.. న్యూజిలాండ్ 9 వికెట్ల భారీ విజయంతో ఫైనల్కు
