South Central Railway : భారీగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కాజీపేట-బల్హర్షా సెక్షన్లో బుధవారం నుంచి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగనుంది. దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఆసిఫాబాద్-రెచ్నీ రోడ్ స్టేషన్ల మధ్య మూడవ లైన్ నిర్మాణం కారణంగా వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లు రద్దు చేయబడ్డాయి. 26 ఎక్స్ప్రెస్లు దారి మళ్లించబడతాయి. రైళ్లు కనిష్టంగా ఒక రోజు నుండి గరిష్టంగా 11 రోజుల వరకు రద్దు చేయబడతాయి.
రద్దు చేయబడిన రైళ్లు: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిచే కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైళ్లు (నం. 12757/12758) జూన్ 26 నుండి జూలై 6 వరకు రద్దు చేయబడ్డాయి. పూణే-కాజీపేట్ ఎక్స్ప్రెస్ (నం. 22151) జూన్ 28 , జూలై 5న.. కాజీపేట-పూణే ఎక్స్ప్రెస్ (నం. 22152) జూన్ 30న , జూలై 7న. జూన్ 28న హైదరాబాద్-గోరఖ్పూర్ (నం. 02575), జూలై 30న గోరఖ్పూర్-హైదరాబాద్ (నం. 02576) ఎక్స్ప్రెస్ రద్దు చేయబడ్డాయి. జూలై 2న ముజఫర్పూర్-సికింద్రాబాద్ (నం. 05293), జూలై 27న సికింద్రాబాద్-ముజఫర్పూర్ (నం. 05294), జూన్ 29న గోరఖ్పూర్ జడ్చర్ల (నం. 05303), జడ్చర్ల-గోరఖ్పూర్ (నం. 05304) రైళ్లు రద్దు చేయబడ్డాయి. జూన్ 26, 27 , 28 తేదీల్లో సికింద్రాబాద్-రక్సాల్ మధ్య మూడు ప్రత్యేక రైళ్లు. జూన్ 27, 28, 29 , జూలై 1 తేదీల్లో సికింద్రాబాద్-దానాపూర్ మధ్య తిరిగే ఆరు ప్రత్యేక రైళ్లు. జూన్ 27, 29 తేదీల్లో సికింద్రాబాద్-సుబేదర్గంజ్ మధ్య తిరిగే రైళ్లు రద్దు చేయబడ్డాయి.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
దారి మళ్లింపు: సికింద్రాబాద్-న్యూఢిల్లీ (నం. 12723) తెలంగాణ ఎక్స్ప్రెస్ కాజీపేట మీదుగా జూలై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్ మీదుగా మళ్లించబడుతుంది. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ఆ మార్గం నుంచి తొలగించారు. న్యూఢిల్లీ-సికింద్రాబాద్ (నం. 12724) తెలంగాణ ఎక్స్ప్రెస్ ముద్ఖేడ్, నిజామాబాద్ మీదుగా జూలై 3, 4, 5 తేదీల్లో నడుస్తుంది. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్లను ఆ మార్గం నుంచి తొలగించారు. సికింద్రాబాద్-నిజాముద్దీన్ (ఢిల్లీ), నిజాముద్దీన్-సికింద్రాబాద్ దురంతో ఎక్స్ప్రెస్ (నెం. 12285/12286) రైళ్లను జూలై 4, 5 తేదీల్లో నిజామాబాద్ మీదుగా మళ్లిస్తారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!