South Central Railway : భారీగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కాజీపేట-బల్హర్షా సెక్షన్లో బుధవారం నుంచి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగనుంది. దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఆసిఫాబాద్-రెచ్నీ రోడ్ స్టేషన్ల మధ్య మూడవ లైన్ నిర్మాణం కారణంగా వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లు రద్దు చేయబడ్డాయి. 26 ఎక్స్ప్రెస్లు దారి మళ్లించబడతాయి. రైళ్లు కనిష్టంగా ఒక రోజు నుండి గరిష్టంగా 11 రోజుల వరకు రద్దు చేయబడతాయి.
రద్దు చేయబడిన రైళ్లు: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిచే కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైళ్లు (నం. 12757/12758) జూన్ 26 నుండి జూలై 6 వరకు రద్దు చేయబడ్డాయి. పూణే-కాజీపేట్ ఎక్స్ప్రెస్ (నం. 22151) జూన్ 28 , జూలై 5న.. కాజీపేట-పూణే ఎక్స్ప్రెస్ (నం. 22152) జూన్ 30న , జూలై 7న. జూన్ 28న హైదరాబాద్-గోరఖ్పూర్ (నం. 02575), జూలై 30న గోరఖ్పూర్-హైదరాబాద్ (నం. 02576) ఎక్స్ప్రెస్ రద్దు చేయబడ్డాయి. జూలై 2న ముజఫర్పూర్-సికింద్రాబాద్ (నం. 05293), జూలై 27న సికింద్రాబాద్-ముజఫర్పూర్ (నం. 05294), జూన్ 29న గోరఖ్పూర్ జడ్చర్ల (నం. 05303), జడ్చర్ల-గోరఖ్పూర్ (నం. 05304) రైళ్లు రద్దు చేయబడ్డాయి. జూన్ 26, 27 , 28 తేదీల్లో సికింద్రాబాద్-రక్సాల్ మధ్య మూడు ప్రత్యేక రైళ్లు. జూన్ 27, 28, 29 , జూలై 1 తేదీల్లో సికింద్రాబాద్-దానాపూర్ మధ్య తిరిగే ఆరు ప్రత్యేక రైళ్లు. జూన్ 27, 29 తేదీల్లో సికింద్రాబాద్-సుబేదర్గంజ్ మధ్య తిరిగే రైళ్లు రద్దు చేయబడ్డాయి.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
దారి మళ్లింపు: సికింద్రాబాద్-న్యూఢిల్లీ (నం. 12723) తెలంగాణ ఎక్స్ప్రెస్ కాజీపేట మీదుగా జూలై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్ మీదుగా మళ్లించబడుతుంది. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ఆ మార్గం నుంచి తొలగించారు. న్యూఢిల్లీ-సికింద్రాబాద్ (నం. 12724) తెలంగాణ ఎక్స్ప్రెస్ ముద్ఖేడ్, నిజామాబాద్ మీదుగా జూలై 3, 4, 5 తేదీల్లో నడుస్తుంది. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్లను ఆ మార్గం నుంచి తొలగించారు. సికింద్రాబాద్-నిజాముద్దీన్ (ఢిల్లీ), నిజాముద్దీన్-సికింద్రాబాద్ దురంతో ఎక్స్ప్రెస్ (నెం. 12285/12286) రైళ్లను జూలై 4, 5 తేదీల్లో నిజామాబాద్ మీదుగా మళ్లిస్తారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!