Trinamool Congress: బీజేపీలో చేరలేదనే గంగూలీపై బీజేపీ కక్ష సాధిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trinamool Congress: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తల నేపథ్యంలో బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందు వల్లే మాజీ కెప్టెన్ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. రాష్ట్రంలో విపరీతమైన ప్రజాదరణ ఉన్న గంగూలీ పార్టీలో చేరతారని గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల్లో సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శిగా రెండోసారి కొనసాగిస్తూ.. అయితే గంగూలీకి మరోసారి అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ‘రాజకీయ ప్రతీకారానికి’ ఉదాహరణ అని తృణమూల్ పేర్కొంది.
బీజేపీ సౌరవ్ను పార్టీలో చేర్చుకుంటున్నట్లుగా బెంగాల్ ప్రజలలో ఒక సందేశాన్ని వ్యాప్తి చేయాలనుకుంటోందని తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. ఈ విషయంపై మేము నేరుగా మాట్లాడాలనుకోవట్లేదుని.. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత అలాంటి వార్తల వ్యాప్తికి బీజేపీ ప్రయత్నించిన క్రమంలోనే మాట్లాడుతున్నారు. బీసీసీఐ చీఫ్గా రెండోసారి గంగూలీని కొనసాగించకపోవటం వెనుక రాజకీయాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయన్నారు. సౌరవ్ను అవమానించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని కునాల్ ఘోష్ అన్నారు. ఈ ఏడాది మే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గంగూలీ ఇంటికి వెళ్లటం వెనుక అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, పరిస్థితులపై మాట్లాడటానికి గంగూలీనే సరైన వ్యక్తి అని పేర్కొన్నారు.
Also Read
- ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ వర్సెస్ బాలుడు.. రోడ్డుపైనే పుషప్స్ ఛాలెంజ్..
బీజేపీ ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొంది. గంగూలీని పార్టీలోకి చేర్చుకోవడానికి పార్టీ ఎప్పుడూ ప్రయత్నించలేదని పేర్కొంది. సౌరవ్ గంగూలీ విషయంలో టీఎంసీ చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్. అవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. గంగూలీని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించిందో తమకైతే తెలియదన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడాన్ని టీఎంసీ మానుకోవాలని హితవు పలికారు. 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ మంగళవారం బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. జై షా కూడా తన నామినేషన్ను దాఖలు చేశారు. ఇతర అభ్యర్థులెవరూ రాకపోతే వరుసగా రెండోసారి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతారు. జై షా ఐసీసీ బోర్డులో భారత ప్రతినిధిగా గంగూలీ స్థానంలో ఉంటారని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!