Telangana Crime: ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు.. డ్రామా ఆడి దొరికిపోయాడు..
- సిద్దిపేట జిల్లాలో ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు కసాయి కొడుకు.. పైగా హత్యని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Crime: మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తిపాస్తుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు కసాయి కొడుకు. పైగా హత్యని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయి చివరికి కటకటాల పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సత్తవ్వ.. రెండో భార్య పోషవ్వ ఇద్దరు సొంత అక్కాచెల్లెళ్లు. సత్తవ్వకు ఓ కుమారుడు, పోషవ్వకు ఇద్దరు కుమారులున్నారు. మల్లయ్య మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడు. సత్తవ్వ గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవిస్తోంది. సత్తవ్వ కొడుకు చంద్రశేఖర్ సిద్దిపేటలో ఉంటున్నాడు. సత్తవ్వ పేరుపై ఐదెకరాలు భూమి ఉంది. ఆ భూమిని తన పేరుపై చేయాలని గత కొన్ని రోజులుగా చంద్రశేఖర్ తల్లితో గొడవ పడుతున్నాడు.
Read Also: AP Crime: లవ్ ఫెయిల్.. ప్రియురాలి హత్యకు యత్నం.. ప్రియుడి ఆత్మహత్య..
Also Read
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
- FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
ఇక, ఈ నెల 11న ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ తిరిగి భూమి విషయంలో తల్లితో గొడవపడ్డాడు. సత్తవ్వ మాత్రం తన చెల్లెలు పోషవ్వకి కూడా ఇద్దరు కుమారులు ఉన్నారని.. అందరికి సమానంగా భూమి పంచుతానని చెప్పింది. దీంతో ఆగ్రహించిన కొడుకు.. తల్లిపై దాడి చేశాడు. తల, శరీర భాగాలపై సత్తవ్వకి తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న తల్లి ప్రాణాలు విడిస్తే తనపై వస్తుందన్న ఉద్దేశ్యంతో కట్టుకథ అల్లాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి కిందపడిందని తండ్రికి చెప్పి నమ్మించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా సత్తవ్వ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అంత్యక్రియల కోసం గ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అయితే సత్తవ్వ తల వెనుక గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, సత్తవ్వ మృతిపై కొడుకుపైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు చంద్రశేఖర్ ని అదుపులోకి తీసుకుని వాచారించగా నేరం ఒప్పకున్నారు. ఆస్తి కోసమే హత్య చేసినట్టు వెల్లడించాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
తాజావార్తలు
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!