Telangana Crime: ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు.. డ్రామా ఆడి దొరికిపోయాడు..
- సిద్దిపేట జిల్లాలో ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు కసాయి కొడుకు.. పైగా హత్యని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Crime: మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తిపాస్తుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు కసాయి కొడుకు. పైగా హత్యని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయి చివరికి కటకటాల పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సత్తవ్వ.. రెండో భార్య పోషవ్వ ఇద్దరు సొంత అక్కాచెల్లెళ్లు. సత్తవ్వకు ఓ కుమారుడు, పోషవ్వకు ఇద్దరు కుమారులున్నారు. మల్లయ్య మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడు. సత్తవ్వ గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవిస్తోంది. సత్తవ్వ కొడుకు చంద్రశేఖర్ సిద్దిపేటలో ఉంటున్నాడు. సత్తవ్వ పేరుపై ఐదెకరాలు భూమి ఉంది. ఆ భూమిని తన పేరుపై చేయాలని గత కొన్ని రోజులుగా చంద్రశేఖర్ తల్లితో గొడవ పడుతున్నాడు.
Read Also: AP Crime: లవ్ ఫెయిల్.. ప్రియురాలి హత్యకు యత్నం.. ప్రియుడి ఆత్మహత్య..
Also Read
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
ఇక, ఈ నెల 11న ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ తిరిగి భూమి విషయంలో తల్లితో గొడవపడ్డాడు. సత్తవ్వ మాత్రం తన చెల్లెలు పోషవ్వకి కూడా ఇద్దరు కుమారులు ఉన్నారని.. అందరికి సమానంగా భూమి పంచుతానని చెప్పింది. దీంతో ఆగ్రహించిన కొడుకు.. తల్లిపై దాడి చేశాడు. తల, శరీర భాగాలపై సత్తవ్వకి తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న తల్లి ప్రాణాలు విడిస్తే తనపై వస్తుందన్న ఉద్దేశ్యంతో కట్టుకథ అల్లాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి కిందపడిందని తండ్రికి చెప్పి నమ్మించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా సత్తవ్వ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అంత్యక్రియల కోసం గ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అయితే సత్తవ్వ తల వెనుక గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, సత్తవ్వ మృతిపై కొడుకుపైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు చంద్రశేఖర్ ని అదుపులోకి తీసుకుని వాచారించగా నేరం ఒప్పకున్నారు. ఆస్తి కోసమే హత్య చేసినట్టు వెల్లడించాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
తాజావార్తలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ గుడ్బై?.. ఇదే ప్రూఫ్!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.