Prakasam Crime: పిల్లను ఇచ్చి పెళ్లి చేశారు.. ఊరికే కన్నం వేసిన దొంగ అల్లుడు..!
- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో విచిత్ర దొంగ..
- గుర్రపుశాల గ్రామంలో దొంగతనాన్ని బయటపెట్టిన పోలీసులు..
- పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఊరికే కన్నం వేసిన అల్లుడు..
- 12 ఇళ్లల్లో దొంగతనం చేసి పరారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakasam Crime: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో విచిత్ర దొంగతనాన్ని బయట పెట్టారు పోలీసులు.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఊరికే కన్నం వేశాడు ఓ అల్లుడు.. దొంగగా మారి.. వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడు.. చూడటానికి విచిత్రంగా ఉన్న అల్లుడే దొంగగా మారి 12 ఇళ్లల్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికి.. చివరకు కటకటాల లెక్క పెడుతున్నాడు ముండ్ల రాయమ్య అనే దొంగ అల్లుడు..
Read Also: Winter: చలికాలంలో హీటర్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో గుర్రపుశాల గ్రామస్తులు పనులకోసం వలసవెళ్లారు. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఓ కుటుంబం అల్లుడు అయిన ముండ్ల రామయ్య.. తమ దగ్గరే పెట్టుకున్నారు. ముండ్ల రామయ్య క్రికెట్ బెట్టింగ్ లు ఆడుతూ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. గ్రామస్తులు పనులకోసం వలసలకు వెళ్లడం గమనించి రోజుకు మూడు ఇళ్లల్లో నాలుగు రోజుల పాటు 12 ఇళ్లల్లో 6 లక్షల 74 వేల రూపాయలు దొంగ తనం చేశారు.. అంతేకాదు.. తనకు ఏమీ తెలియనట్లు హైదరాబాద్ వెళ్లి జల్సాలు చేయడం మొదలెట్టాడు. గ్రామంలో కొన్ని ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై చౌడయ్య గుర్రపుశాల గ్రామం పోయి అక్కడ దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ దొంగతనంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు గ్రామ అల్లుడే దొంగగా నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్ లో వలపన్ని పట్టుకొని యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముద్దాయి ముండ్ల రామయ్యను కోర్టులో హాజరు పరిచి రికవరీ చేసిన 6 లక్షల 74వేల రూపాయల నగదును కోర్టు ద్వారా బాధితులకు అందజేస్తామని సీఐ ప్రభాకర్ రావు మీడియాకు టెలిపారు. ఊరి అల్లుడే దొంగ అని తెలియడంతో గ్రామస్తులు అంతా అవాక్కయ్యారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!