Prakasam Crime: పిల్లను ఇచ్చి పెళ్లి చేశారు.. ఊరికే కన్నం వేసిన దొంగ అల్లుడు..!
- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో విచిత్ర దొంగ..
- గుర్రపుశాల గ్రామంలో దొంగతనాన్ని బయటపెట్టిన పోలీసులు..
- పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఊరికే కన్నం వేసిన అల్లుడు..
- 12 ఇళ్లల్లో దొంగతనం చేసి పరారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakasam Crime: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో విచిత్ర దొంగతనాన్ని బయట పెట్టారు పోలీసులు.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఊరికే కన్నం వేశాడు ఓ అల్లుడు.. దొంగగా మారి.. వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడు.. చూడటానికి విచిత్రంగా ఉన్న అల్లుడే దొంగగా మారి 12 ఇళ్లల్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికి.. చివరకు కటకటాల లెక్క పెడుతున్నాడు ముండ్ల రాయమ్య అనే దొంగ అల్లుడు..
Read Also: Winter: చలికాలంలో హీటర్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
Also Read
- Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
- Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో గుర్రపుశాల గ్రామస్తులు పనులకోసం వలసవెళ్లారు. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఓ కుటుంబం అల్లుడు అయిన ముండ్ల రామయ్య.. తమ దగ్గరే పెట్టుకున్నారు. ముండ్ల రామయ్య క్రికెట్ బెట్టింగ్ లు ఆడుతూ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. గ్రామస్తులు పనులకోసం వలసలకు వెళ్లడం గమనించి రోజుకు మూడు ఇళ్లల్లో నాలుగు రోజుల పాటు 12 ఇళ్లల్లో 6 లక్షల 74 వేల రూపాయలు దొంగ తనం చేశారు.. అంతేకాదు.. తనకు ఏమీ తెలియనట్లు హైదరాబాద్ వెళ్లి జల్సాలు చేయడం మొదలెట్టాడు. గ్రామంలో కొన్ని ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై చౌడయ్య గుర్రపుశాల గ్రామం పోయి అక్కడ దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ దొంగతనంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు గ్రామ అల్లుడే దొంగగా నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్ లో వలపన్ని పట్టుకొని యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముద్దాయి ముండ్ల రామయ్యను కోర్టులో హాజరు పరిచి రికవరీ చేసిన 6 లక్షల 74వేల రూపాయల నగదును కోర్టు ద్వారా బాధితులకు అందజేస్తామని సీఐ ప్రభాకర్ రావు మీడియాకు టెలిపారు. ఊరి అల్లుడే దొంగ అని తెలియడంతో గ్రామస్తులు అంతా అవాక్కయ్యారు.
తాజావార్తలు
-
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్రూమ్ వార్ అదిరింది
-
Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!