Somu Veerraju: ఏపీలో ఆందోళనలపై ప్రెజంటేషన్కు మోదీ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇవాళ ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరై న నేతలు జాతీయ స్థాయిలో పలు అంశాలపై జరిగిన చర్చల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణ పై సమావేశాల్లో చర్చించామన్నారు. 2024లో ఏపీలో జరిగే ఎన్నికలకే ప్రాధాన్యత ఇచ్చాం అన్నారు. అధికారంలో లేని రాష్ట్రాల్లో పార్టీ నిర్వహించిన ప్రజా ఆందోళనలు, ఉద్యమాలపై చర్చ జరిగింది.
ఏపీలో ప్రాంతాల వారీగా పార్టీ నిర్వహించిన ఉద్యమాలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా నిర్వహించిన “ప్రజాపోరు” యాత్రలు, సభలు ఏవిధంగా కొనసాగించింది ప్రెజెంటేషన్ ఇచ్చాం.ఈ తరహా “ప్రజాపోరు” యాత్రలు నిర్వహించాలని బిజెపి అధికారం లేని రాష్ట్రాలలోని బిజెపి శాఖ లు కూడా నిర్వహించాలని నిర్ణయించడం విశేషం. ఏపి లో నిర్వహించిన ప్రజా ఆందోళనలపై ఇచ్చిన “ప్రెజెంటేషన్”జాతీయ నాయకులను ఆకట్టుకుందన్నారు సోము వీర్రాజు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఇటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీ కీలక సందేశాలిచ్చారు. భారతదేశానికి భవ్యమైన భవిష్యత్తు ఉందన్నారు మోడీ. దేశాభివృద్ధిలో సమాజాన్ని భాగస్వామిని చేస్తూ ముందుకెళ్లాలన్నదే ప్రధానమంత్రి సందేశం. అప్పుడే సమగ్రమైన పురోగతి సాధ్యమని ప్రధాని చెప్పారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 2024 పార్లమెంటు ఎన్నికలు నడ్డాగారి నేతృత్వంలోనే.. ఆలోపలే 9 రాష్ట్రాల ఎన్నికలు కూడా వస్తాయన్నారు. టీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందన్నారు. వారిని త్వరలోనే ఫాం హౌజ్ కు పరిమితం చేయడం ఖాయం అన్నారు కిషన్ రెడ్డి.
ఈ రెండ్రోజుల్లో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలతోపాటు రానున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జేపీ నడ్డా నేతృత్వంలోనే పార్టీ ముందుకెళ్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. సమావేశాల ముగింపులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయకమైన మార్గదర్శనం చేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం పార్టీ ఆధర్వ్యంలో జరుగుతున్న కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మోదీ సూచించారన్నారు.
Read Also: Military Threat: చైనా తర్వాత అమెరికా నుంచే భారత్కు ముప్పు.. సర్వేలో భారతీయుల అభిప్రాయం
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!