AP Special Category Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు.. వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Special Category Status: ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై పలు సందర్భాల్లో కేంద్రం తేల్చేసింది.. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయంగా పేర్కొంది.. అయితే, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదన్న ఆయన.. ప్రత్యేక హోదా అంశం పూర్తయిన అంశం.. ఇంకా దాంట్లో ఏమైన కొరవలు ఉంటే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. శ్రీకాళహస్తిలో రేపు జరగనున్న భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి పరిశీలించిన రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత తొమ్మిళ్లేగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అందించిన సుపరిపాలన ప్రజలకు వివరించేందుకు రాష్ర్టంలోని 26 జిల్లాల్లో ఈ సభలు నిర్వహిస్తున్నాం అన్నారు.
Read Also: Big Breaking: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. పింఛన్ పెంపు
Also Read
ఇక, శ్రీకాళహస్తిలో జరిగే సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే రాష్ర్టంలో ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారని తెలిపారు సోము వీర్రాజు.. ఈ నెల 11వ తేదీన విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు.. అలాగే కేంద్ర మంత్రి మురళీధరన్ మూడు జిల్లాల్లో జరిగే సభల్లో పాల్గొంటారని.. ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అభివృద్ధి వివరిస్తామన్నారు. జూన్ 30వ తేదీ తర్వాత రైతాంగ సమస్యలు, టిడ్కో ఇళ్ళ సమస్యల పై పోరాటం చేస్తామని ప్రకటించారు.. రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామన్నారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!