Seethakka: ఆదివాస బిడ్డనైన నన్ను మంత్రిగా చూసి కొందరు ఓర్చుకోలేకపోతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెంపుడు మనుషులను పెట్టుకుని బీఆర్ఎస్ వాళ్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. తీన్మార్ మల్లన్న పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి పంపిందన్నారు.
శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. వందల కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు నన్ను ఎమ్మెల్యేగా గెలవకుండా చేయాలని ప్రయత్నం చేశారన్నారు. ఈరోజు తీన్మార్ మల్లన్న పై కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఆదివాస బిడ్డనైన నన్ను మంత్రిగా చూసి కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారన్నారు. మొదటి విడుతగా సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ప్రోత్సాహకంగా ప్రకటించామని తెలిపారు. దొడ్డు వడ్లను కొనమని ఏ ఒక్క సందర్భంలో అనలేదని స్పష్టం చేశారు. తినడానికి ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫస్ట్ తారీకు రాగానే అందరికీ జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. రైతుల సమస్యలను, నిరుద్యోగుల సమస్యలు ప్రతి ఒక్కటి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
READ MORE: Heatwave effect: రాజస్థాన్లో తీవ్రమైన వాడగాలులు.. 12 మంది మృతి
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
కాగా.. ఉమ్మడి నల్గొండ- ఖమ్మం -వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఉప ఎన్నికల్లో చింతపండు నవీన్ గారిని బలపరుస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ లు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల పట్టభద్రులు తప్పకుండా సీపీఎస్ రద్దు -పాత పెన్షన్ పునరుద్ధరణ కృషి చేసే మల్లన్న ను మొదటి ప్రాధాన్యత ఓటు తో గెలిపించాలన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!