AP High Court: చంద్రబాబు అరెస్ట్ పై జడ్జిలపై ట్రోలింగ్.. ఏపీ హైకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో జడ్జిలపై ట్రోలింగ్ చేయటంపై క్రిమినల్ కంటెంప్ట్ కింద దాఖలైన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలోనే ప్రతివాదులు 26 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఐదుగురు ప్రతివాదుల ఆచూకీ గుర్తించటం కష్టంగా మారిందని కోర్టుకు అడ్వొకెట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లతో పోస్టింగ్ లు పెట్టినట్టు ఆయన కోర్టుకు వెల్లడించారు. జడ్జిలను దూషిస్తూ పెట్టిన పోస్టింగ్స్ ఫేక్ అకౌంట్స్ కావటంతో వారిని గుర్తించటం కష్టంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ చెప్పడంతో.. మిగతా వారికి నోటీసులు ఇవ్వటానికి సమయం కావాలని ఆయన కోరినట్లు తెలుస్తుంది. ఇక, కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 4 వారాల తర్వాత తదుపరి విచారణ చేస్తున్నట్లు ఏపీ హైకోర్టు ప్రకటించింది.
Read Also: India Alliance Meeting: ఇండియా కూటమి కీలక భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ!
Also Read
అయితే, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన పిటిషన్లు విచారించిన జడ్జిలు, వారి కుటుంబీకులపై రాజకీయపరంగా ఉద్దేశపూర్వకంగా దూషణలతో కూడిన పోస్టింగ్స్ పెట్టడంతో వాటిని ఏపీ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు జడ్జి కుటుంబం టార్గెట్గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. అయితే, జడ్జీలపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే గుర్తించి.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్ సూచించింది.
తాజావార్తలు
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?