Rs.500Note : రూ.500నోటుపై రాముడి ఫోటో.. జనవరి 22న రిలీజ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.500Note : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతుంది.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగరాజ్ చెక్కిన బాల రాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు. ప్రజలంతా ఇప్పటికే రామనామ స్మరణలో మునిగిపోయారు. రామమందిర ప్రారంభోత్సవంలో.. దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలోనే ఓ సంచలన వార్త ఒకటి చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోట్ల కొత్త సిరీస్ను విడుదల చేయబోతుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోటును ఆర్బీఐ విడుదల చేయబోతుందని దాంట్లో పేర్కొన్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో పాటు రూ.500 నోటు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also:Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
Also Read
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
NEW 500 NOTES WILL BE ISSUED ON 22/01/2024
நிஜமா? 🤔🤔🤔🤔 pic.twitter.com/peiCwlr9oZ
— 😇 ✍lαthα αѕhσkrαj 🇮🇳 (@TenthPlanet1) January 16, 2024
మహాత్మా గాంధీకి బదులుగా శ్రీరాముడి చిత్రం
సాధారణంగా రూ.500 నోటులో జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. అయోధ్యలోని శ్రీరాముడు, శ్రీరామ మందిరం చిత్రాలతో కూడిన రూ.500 నోటుపై వైరల్ అవుతుంది. ఎర్రకోట ఫోటో ఉన్న చోట అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న ఫోటో ఉంది. మహాత్మా గాంధీ ఫోటో ఉన్న చోట శ్రీరాముడి ఫోటో ఉంది.
Read Also:Pakistan : పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరంపై ఇరాన్ వైమానిక దాడులు
RBI కొత్త సిరీస్ నోట్లను జారీ చేస్తుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా శ్రీరాముడి చిత్రం ఉన్న కొత్త సిరీస్ రూ.500 నోట్లను విడుదల చేయడం గురించి ఎటువంటి సమాచారం తెరపైకి రాలేదు. శ్రీరాముడి చిత్రాలతో వైరల్ అవుతున్న రూ.500 నోటు నకిలీది. బ్యాంకింగ్ రంగ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వనీ రాణా మాట్లాడుతూ కొత్త నోటు విడుదల చేస్తున్నట్లు ఆర్బిఐ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఇదంతా ఫేక్ న్యూస్ అని అన్నారు.
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!