BSF: స్మగ్లర్లు LOC వెంబడి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని సున్నితమైన పాయింట్లను మ్యాపింగ్ చేయడంతో పాటు.. డ్రోన్ల కదలికలు, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి ఏజెన్సీ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) సిద్ధం చేసినట్లు సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులు తెలిపారు. చండీగఢ్లో బీఎస్ఎఫ్ వెస్ట్రన్ కమాండ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్ల కదలికలను బీఎస్ఎఫ్ పర్యవేక్షిస్తోందని, గత ఏడాది కాలంలో 95 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపారు.
Storage Of Grains: ధాన్యం నిల్వలో ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Also Read
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
డ్రోన్ల కదలికలను తనిఖీ చేయడానికి తాము SOPని అభివృద్ధి చేసామని.. అందుకోసం BSF సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు యోగేష్ తెలిపారు. అంతేకాకుండా.. డ్రోన్ సాంకేతికతతో బాగా ప్రావీణ్యం ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. నిఘా పెంచడంతో స్మగ్లర్లు పెద్ద పెద్ద డ్రోన్లను వాడడం మానేశారన్నారు. స్మగ్లర్లు ఇంతకుముందు మూడు నుంచి ఐదు కిలోల వరకు పేలోడ్లను మోసుకెళ్లగల భారీ లిఫ్ట్ డ్రోన్లను ఉపయోగించేవారని యోగేష్ బహదూర్ ఖురానియా చెప్పారు. ప్రస్తుతం 400 నుంచి 500 గ్రాముల పేలోడ్ సామర్థ్యం ఉన్న చిన్న డ్రోన్లను ఉపయోగిస్తున్నామని, వాటి ధర మధ్యస్థంగా ఉందని ఆయన చెప్పారు.
Pawan Kalyan: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం..
చిన్న డ్రోన్లను గుర్తించడం కష్టమే.. కానీ ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి BSF సిద్ధంగా ఉందని యోగేష్ బహదూర్ తెలిపారు. పంజాబ్ పోలీసుల కమాండ్ను మెచ్చుకున్న బీఎస్ఎఫ్ స్పెషల్ డీజీ.. పోలీసుల సహకారం వల్లే బీఎస్ఎఫ్ సరిహద్దులోని సున్నితమైన ప్రాంతాలను గుర్తించగలిగామని చెప్పారు. మరోవైపు.. గ్రే ఏరియాల జాబితాను రూపొందించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, 2024 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఫెన్సింగ్ విస్తీర్ణం పెంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని, దానిని అమలు చేస్తామన్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో అక్రమ మైనింగ్ను నిలిపివేసినట్లు బీఎస్ఎఫ్ డీజీ ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
తాజావార్తలు
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!