Smriti Mandhana Wedding: చివరి నిమిషంలో స్మృతి మందాన-పలాష్ పెళ్లి క్యాన్సిల్.. కథలో కొత్త ట్విస్ట్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana Wedding: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె ఆటతీరు కారణంగా కాదు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాల వల్ల. గత ఏడాది సంగీత దర్శకుడు పలస్ ముచ్చల్ తో ఆమె పెళ్లి చివరి నిమిషంలో రద్దవడం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. 2025 నవంబర్ 23న మహారాష్ట్రలోని సంగ్లీ పట్టణంలో వీరిద్దరి వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత కూడా పెళ్లిని రద్దు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటగా మందాన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని కారణం చెబుతూ పెళ్లి వాయిదా వేసినట్లు ప్రకటించారు.
Also Read
- CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
అయితే సోషల్ మీడియాలో మాత్రం పలు వదంతులు చక్కర్లు కొట్టాయి. పలాష్ ముచ్ఛల్ మందానను మోసం చేశాడనే ఆరోపణలు వినిపించాయి. ఈ కారణంగానే మందాన ఈ పెళ్లిని ధైర్యంగా రద్దు చేసుకుందని ప్రచారం జరిగింది. చివరికి ఇరు కుటుంబాలు తమ సంబంధం ముగిసిందని అధికారికంగా ప్రకటించడంతో ఈ కథకు ముగింపు పడింది. ఇక తాజాగా మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. మంధాన తండ్రి శ్రీనివాస్, పలాష్ సోదరి పలక్ ముచ్చల్ కుటుంబంతో కలిసి స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో పలక్, మందాన తండ్రి పాదాలకు నమస్కారం చేయడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. దీంతో మళ్లీ ఇరు కుటుంబాలు కలిసే అవకాశముందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
Israel Attacks: 10 నిమిషాల్లోనే అంతా బూడిద.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఇజ్రాయెల్..
కానీ తాజా సమాచారం ప్రకారం, మందాన-పలాష్ మళ్లీ కలిసే అవకాశం లేదని స్పష్టమైంది. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోయారని, తిరిగి సంబంధం కొనసాగించే పరిస్థితి లేదని వెల్లడైంది. కుటుంబాల మధ్య ఈ కలయిక కేవలం పరస్పర గౌరవంతో జరిగిన సాధారణ సమావేశమేనని సమాచారం. పలాష్ ముచ్ఛల్ విషయానికి వస్తే.. అతను బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు. ‘డిష్కియావూన్’, ‘భూత్నాథ్ రిటర్న్స్’ వంటి సినిమాలకు సంగీతం అందించారు. తర్వాత ‘అర్ధ్’ సినిమా ద్వారా దర్శకుడిగా కూడా మారారు. అలాగే ఆయన సోదరి పలక్ ముచ్ఛల్, బావ మిథూన్ కూడా ప్రముఖ గాయకులు.
తాజావార్తలు
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!