Smriti Mandhana Wedding: చివరి నిమిషంలో స్మృతి మందాన-పలాష్ పెళ్లి క్యాన్సిల్.. కథలో కొత్త ట్విస్ట్.!
Smriti Mandhana Wedding: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె ఆటతీరు కారణంగా కాదు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాల వల్ల. గత ఏడాది సంగీత దర్శకుడు పలస్ ముచ్చల్ తో ఆమె పెళ్లి చివరి నిమిషంలో రద్దవడం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. 2025 నవంబర్ 23న మహారాష్ట్రలోని సంగ్లీ పట్టణంలో వీరిద్దరి వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత కూడా పెళ్లిని రద్దు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటగా మందాన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని కారణం చెబుతూ పెళ్లి వాయిదా వేసినట్లు ప్రకటించారు.
Also Read
- Faria Abdullah: అతని కోసమె నేను ఇండస్ట్రీలోకి వచ్చాను.. అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
- MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
- Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
అయితే సోషల్ మీడియాలో మాత్రం పలు వదంతులు చక్కర్లు కొట్టాయి. పలాష్ ముచ్ఛల్ మందానను మోసం చేశాడనే ఆరోపణలు వినిపించాయి. ఈ కారణంగానే మందాన ఈ పెళ్లిని ధైర్యంగా రద్దు చేసుకుందని ప్రచారం జరిగింది. చివరికి ఇరు కుటుంబాలు తమ సంబంధం ముగిసిందని అధికారికంగా ప్రకటించడంతో ఈ కథకు ముగింపు పడింది. ఇక తాజాగా మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. మంధాన తండ్రి శ్రీనివాస్, పలాష్ సోదరి పలక్ ముచ్చల్ కుటుంబంతో కలిసి స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో పలక్, మందాన తండ్రి పాదాలకు నమస్కారం చేయడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. దీంతో మళ్లీ ఇరు కుటుంబాలు కలిసే అవకాశముందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
Israel Attacks: 10 నిమిషాల్లోనే అంతా బూడిద.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఇజ్రాయెల్..
కానీ తాజా సమాచారం ప్రకారం, మందాన-పలాష్ మళ్లీ కలిసే అవకాశం లేదని స్పష్టమైంది. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోయారని, తిరిగి సంబంధం కొనసాగించే పరిస్థితి లేదని వెల్లడైంది. కుటుంబాల మధ్య ఈ కలయిక కేవలం పరస్పర గౌరవంతో జరిగిన సాధారణ సమావేశమేనని సమాచారం. పలాష్ ముచ్ఛల్ విషయానికి వస్తే.. అతను బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు. ‘డిష్కియావూన్’, ‘భూత్నాథ్ రిటర్న్స్’ వంటి సినిమాలకు సంగీతం అందించారు. తర్వాత ‘అర్ధ్’ సినిమా ద్వారా దర్శకుడిగా కూడా మారారు. అలాగే ఆయన సోదరి పలక్ ముచ్ఛల్, బావ మిథూన్ కూడా ప్రముఖ గాయకులు.
తాజావార్తలు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమె నేను ఇండస్ట్రీలోకి వచ్చాను.. అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
-
PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!