Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్లో పొగలు..! అరగంట నిలిచిన రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెడుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో బుధవారం సాయంత్రం పొగలు వచ్చాయి. తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్తోన్న వందే భారత్ రైలులో పొగలు రావడంతో అధికారులు అరగంట పాటు నిలిపివేశారు. నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే పొగలు వచ్చాయి. వాటిని గుర్తించిన రైల్వే సిబ్బంది మనుబోలు రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలును నిలిపివేశారు. అనంతరం అందులో ప్రయాణికులందర్నీ బోగీ నుండి కిందకు దింపారు. దీంతో ప్రాణపాయం తప్పింది.
Schengen Visa: సూపర్ ఫాస్ట్ గా జర్మనీ షెంజెన్ వీసా ప్రక్రియ.. సిబ్బందిని పెంచిన రాయబార కార్యాలయం
Also Read
వందేభారత్ రైలులోని మూడో బోగీలో పొగలను గుర్తించారు. బాత్రూమ్ నుండి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి తనిఖీ చేపట్టారు. అయితే సిగరేట్ కాల్చిపడేసిన ముక్క కనపడింది. అది ప్లాస్టిక్ సామాగ్రికి వ్యాపించడంతో పొగ వచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించారు. అనంతరం రైలులో పొగలను పూర్తిగా ఆపివేసి, రైలును పంపించారు.
- Tags
- Cigarette
- smoke
- stop
- Train
- Vande Bharat
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!