Bihar Sampark Kranti : బీహార్ సంపర్క్ క్రాంతి రైలులో పొగలు..బయటకు దూకిన ప్రయాణికులు
- సమస్తిపూర్ రైల్వే స్టేషన్ నుంచి కదిలిన రైలు
- మంటలు చెలరేగాయంటూ..జనరల్ బోగీ నుంచి ప్లాట్ఫారమ్పైకి దూకిన ప్రయాణికులు
- ఘటనా స్థలానికి చేరకున్న అధికారులు
- మంటలు ఆర్పే యంత్రం లీక్ అయినట్లు గుర్తింపు
- ఎలాంటి మంటలు చెలరేగలేదని నిర్ధారించి రైలును పంపిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో బీహార్ సంపర్క్ క్రాంతి రైలు జనరల్ బోగీలో నుంచి ప్రయాణికుల అరుస్తూ. పరుగులు పెట్టారు. మంటలు చెలరేగుతున్నాయని అరుస్తూ ప్రయాణికులు రైలు నుంచి దూకారు. దీంతో స్టేషన్లో గందరగోళ వాతావరణం నెలకొంది. రైలు ప్లాట్ఫారమ్పై నుంచి కదలగానే ఈ ఘటన చోటుచేసుకుంది. గమనించిన లోకోపైలెట్ వెంటనే రైలును నిలిపారు.
READ MORE: Seethakka: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ..
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
స్టేషన్లో మోహరించిన ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ సిబ్బంది వెంటనే ప్రజలు దూకుతున్న రైలు బోగీ వద్దకు చేరుకున్నారు. అక్కడికక్కడే విచారణ చేయగా బోగీలో ఉంచిన అగ్నిమాపక సిలిండర్ ఒక్కసారిగా లీకైనట్లు గుర్తించారు. రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే రైల్వే మెకానికల్ విభాగం కమిటీ అధికారులు స్టేషన్కు చేరుకుని విచారణ చేపట్టారు. అంతా బాగానే ఉందని చూసి.. రైలును 10:30 గంటలకు ముజఫర్పూర్కు పంపారు.
READ MORE:YouTuber: నూతన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే డెలివరీ బాయ్స్ సంపాదనే ఎక్కువ..!
ఈ ఘటనకు సంబంధించి సమస్తిపూర్ రైల్వే డీఎస్పీ రోషన్ కుమార్ గుప్తా సమాచారం ప్రకారం.. రైలు నంబర్ 12565 దర్భంగా-న్యూ ఢిల్లీ బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఆదివారం 09:21 గంటలకు సమస్తిపూర్ స్టేషన్కు చేరుకుంది. సుమారు 09:45 గంటలకు.. రైలు బయలుదేరుతుండగా.. జనరల్ కోచ్ నంబర్ 205056/Cలో పొగలు వచ్చాయి. ప్రయాణికులు ప్లాట్ఫారమ్పైకి దూకారు. మంటలు చెలరేగాయని పుకార్లు రావడంతో కోచ్ నంబర్ 205056/సీని విచారించాం. ఇది జనరల్ కోచ్. కోచ్లో ఉంచిన మంటలను ఆర్పే యంత్రంపై ఓ ప్రయాణికుడు కూర్చున్నట్లు విచారణలో తేలింది. దీంతో అగ్నిమాపక యంత్రం లీక్ అయ్యింది. సిలిండర్ లో నింపిన డ్రై కెమికల్ పౌడర్ బయటకు రావడం మొదలైంది. ఆ పొగలు వ్యాపించడంతో మంటలు చెలరేగాయని ప్రయాణికులు ఆందోళన చెంది బయటకు దూకారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదు.
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?