Bihar Sampark Kranti : బీహార్ సంపర్క్ క్రాంతి రైలులో పొగలు..బయటకు దూకిన ప్రయాణికులు
- సమస్తిపూర్ రైల్వే స్టేషన్ నుంచి కదిలిన రైలు
- మంటలు చెలరేగాయంటూ..జనరల్ బోగీ నుంచి ప్లాట్ఫారమ్పైకి దూకిన ప్రయాణికులు
- ఘటనా స్థలానికి చేరకున్న అధికారులు
- మంటలు ఆర్పే యంత్రం లీక్ అయినట్లు గుర్తింపు
- ఎలాంటి మంటలు చెలరేగలేదని నిర్ధారించి రైలును పంపిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో బీహార్ సంపర్క్ క్రాంతి రైలు జనరల్ బోగీలో నుంచి ప్రయాణికుల అరుస్తూ. పరుగులు పెట్టారు. మంటలు చెలరేగుతున్నాయని అరుస్తూ ప్రయాణికులు రైలు నుంచి దూకారు. దీంతో స్టేషన్లో గందరగోళ వాతావరణం నెలకొంది. రైలు ప్లాట్ఫారమ్పై నుంచి కదలగానే ఈ ఘటన చోటుచేసుకుంది. గమనించిన లోకోపైలెట్ వెంటనే రైలును నిలిపారు.
READ MORE: Seethakka: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ..
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
స్టేషన్లో మోహరించిన ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ సిబ్బంది వెంటనే ప్రజలు దూకుతున్న రైలు బోగీ వద్దకు చేరుకున్నారు. అక్కడికక్కడే విచారణ చేయగా బోగీలో ఉంచిన అగ్నిమాపక సిలిండర్ ఒక్కసారిగా లీకైనట్లు గుర్తించారు. రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే రైల్వే మెకానికల్ విభాగం కమిటీ అధికారులు స్టేషన్కు చేరుకుని విచారణ చేపట్టారు. అంతా బాగానే ఉందని చూసి.. రైలును 10:30 గంటలకు ముజఫర్పూర్కు పంపారు.
READ MORE:YouTuber: నూతన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే డెలివరీ బాయ్స్ సంపాదనే ఎక్కువ..!
ఈ ఘటనకు సంబంధించి సమస్తిపూర్ రైల్వే డీఎస్పీ రోషన్ కుమార్ గుప్తా సమాచారం ప్రకారం.. రైలు నంబర్ 12565 దర్భంగా-న్యూ ఢిల్లీ బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఆదివారం 09:21 గంటలకు సమస్తిపూర్ స్టేషన్కు చేరుకుంది. సుమారు 09:45 గంటలకు.. రైలు బయలుదేరుతుండగా.. జనరల్ కోచ్ నంబర్ 205056/Cలో పొగలు వచ్చాయి. ప్రయాణికులు ప్లాట్ఫారమ్పైకి దూకారు. మంటలు చెలరేగాయని పుకార్లు రావడంతో కోచ్ నంబర్ 205056/సీని విచారించాం. ఇది జనరల్ కోచ్. కోచ్లో ఉంచిన మంటలను ఆర్పే యంత్రంపై ఓ ప్రయాణికుడు కూర్చున్నట్లు విచారణలో తేలింది. దీంతో అగ్నిమాపక యంత్రం లీక్ అయ్యింది. సిలిండర్ లో నింపిన డ్రై కెమికల్ పౌడర్ బయటకు రావడం మొదలైంది. ఆ పొగలు వ్యాపించడంతో మంటలు చెలరేగాయని ప్రయాణికులు ఆందోళన చెంది బయటకు దూకారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?