Secunderabad: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్ లో 100 రోజుల పాటు ప్లాట్ఫామ్స్ క్లోజ్
- సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ఫామ్లు మూసివేత
- ఆధునీకరణలో భాగంగా ఆరు ప్లాట్ఫామ్లు క్లోజ్
- చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి పలు రైళ్ల మళ్లింపు
- 100 రోజుల పాటు ఆరు ప్లాట్ఫామ్లు మూసివేత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రయాణికులకు తాత్కాలిక అసౌకర్యం తప్పడంలేదు. దీనికి కారణం స్టేషన్ లో భారీ స్థాయిలో జరగబోయే ఆధునీకరణ పనులు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే వ్యవస్థను ఆధునీకరించడంపై విశేషంగా దృష్టి పెట్టడంతో.. దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాల తరహాలో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను కూడా ఆధునీకరించేందుకు చర్యలు ప్రారంభించారు.
ఈ ఆధునీకరణలో భాగంగా, సికింద్రాబాద్ స్టేషన్లోని 6 ప్లాట్ఫామ్లను 100 రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ కారణంగా 120 జతల రైళ్ల రూట్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు మళ్లిస్తున్నారు. ముఖ్యంగా, చర్లపల్లి నుంచి ఎక్కువ రైళ్లు నడపనున్నట్లు మొదలు పెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్లో రెండస్తుల భారీ స్కై కాంకోర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ కాంకోర్స్లో ప్రయాణికుల కోసం అన్ని సౌకర్యాలుఅంటే.. రెస్టారెంట్లు, కియోస్క్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అలా అన్ని స్కై కాంకోర్స్కు అనుసంధానంగా ఉండేలా ప్రణాళికలు చేపట్టనున్నారు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
5, 6వ ప్లాట్ఫామ్ల మధ్య 500 టన్నుల సామర్థ్యం గల భారీ హోవీ క్రేన్ ఏర్పాటు చేస్తుండడంతో.. దీనికోసం ప్లాట్ఫామ్ల మధ్య గ్యాప్ను ఇసుక బస్తాలతో నింపి, క్రేన్ సహాయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనితో మొత్తం 6 ప్లాట్ఫామ్లు తాత్కాలికంగా ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఈ తాత్కాలిక అసౌకర్యం నుంచి ప్రయాణికులను తప్పించేందుకు, రైల్వే శాఖ చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి రైళ్లను నడిపే ఏర్పాట్లు చేసింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!