Secunderabad: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్ లో 100 రోజుల పాటు ప్లాట్ఫామ్స్ క్లోజ్
- సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ఫామ్లు మూసివేత
- ఆధునీకరణలో భాగంగా ఆరు ప్లాట్ఫామ్లు క్లోజ్
- చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి పలు రైళ్ల మళ్లింపు
- 100 రోజుల పాటు ఆరు ప్లాట్ఫామ్లు మూసివేత.
Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రయాణికులకు తాత్కాలిక అసౌకర్యం తప్పడంలేదు. దీనికి కారణం స్టేషన్ లో భారీ స్థాయిలో జరగబోయే ఆధునీకరణ పనులు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే వ్యవస్థను ఆధునీకరించడంపై విశేషంగా దృష్టి పెట్టడంతో.. దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాల తరహాలో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను కూడా ఆధునీకరించేందుకు చర్యలు ప్రారంభించారు.
ఈ ఆధునీకరణలో భాగంగా, సికింద్రాబాద్ స్టేషన్లోని 6 ప్లాట్ఫామ్లను 100 రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ కారణంగా 120 జతల రైళ్ల రూట్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు మళ్లిస్తున్నారు. ముఖ్యంగా, చర్లపల్లి నుంచి ఎక్కువ రైళ్లు నడపనున్నట్లు మొదలు పెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్లో రెండస్తుల భారీ స్కై కాంకోర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ కాంకోర్స్లో ప్రయాణికుల కోసం అన్ని సౌకర్యాలుఅంటే.. రెస్టారెంట్లు, కియోస్క్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అలా అన్ని స్కై కాంకోర్స్కు అనుసంధానంగా ఉండేలా ప్రణాళికలు చేపట్టనున్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
5, 6వ ప్లాట్ఫామ్ల మధ్య 500 టన్నుల సామర్థ్యం గల భారీ హోవీ క్రేన్ ఏర్పాటు చేస్తుండడంతో.. దీనికోసం ప్లాట్ఫామ్ల మధ్య గ్యాప్ను ఇసుక బస్తాలతో నింపి, క్రేన్ సహాయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనితో మొత్తం 6 ప్లాట్ఫామ్లు తాత్కాలికంగా ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఈ తాత్కాలిక అసౌకర్యం నుంచి ప్రయాణికులను తప్పించేందుకు, రైల్వే శాఖ చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి రైళ్లను నడిపే ఏర్పాట్లు చేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!