Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sitaram Yechury Fires On Modi Govt

Sitaram Yechury: మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

Published Date :September 24, 2022 , 1:38 pm
By NTV WebDesk
Sitaram Yechury: మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

విజయవాడలో సీపీఎం దేశ రక్షణ భేరీ సభ జరుగుతోంది. ఈ సభలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కీలక ఉపన్యాసం చేశారు. దేశ వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి నేటి వరకు రక్షణ భేరి సభలు నిర్వహిస్తున్నాం అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. రాజ్యాంగానికి మోదీ తూట్లు పొడుస్తున్నారు. 8 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. దేశంలో పేదరికం, నిరుద్యోగం ఎక్కువైపోయింది.11 లక్షల కోట్ల రూపాయలు రుణాలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వారికి మాఫీ చేసారన్నారు.

బ్యాంకులకు రుణాలు ఎగ్గిట్టిన వారంతా మోదీ స్నేహితులే. 330 స్థానంలో వున్న అధాని, మోదీ పాలనలో 3 వ స్థానానికి వెళ్ళాడు. కుభేరులు అంతా గుజరాతీయులే.రానున్న రోజుల్లో కేంద్రంలో ప్రజలకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. లౌకికవాదన్ని నిర్వీర్యం చేస్తుంది బిజెపి. ఆ పార్టీలోకి రాకుంటే వారిపై ఈడి దాడులు చేస్తున్నారు. డబ్బు ఎర చూపి ఓడిపోయిన రాష్ట్రల్లో మరోసారి బిజేపి అధికారంలోకి వస్తుంది…బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు ఎక్కువైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
  • Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!
  • Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..

బిజేపికి ఆయుధాలు ఈడి, సీబీఐ. భారతదేశాన్ని కాపాడాలంటే బిజేపిను ఓడించాలి. పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు మా ప్రభుత్వం వస్తే ఏపికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సారాలు అన్నారు. ప్రత్యేక హోదా పై బీజేపి మాట మార్చిందన్నారు. ఎర్ర జెండాల ఉద్యమం వల్లే దేశంలో అభివృద్ధి జరిగిందన్నారు. మళ్ళీ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. లౌకిక వాదాన్ని కాపాడేందుకు ముందుకొచ్చే వారితో కలిసి పనిచేద్దాం అన్నారు సీతారాం ఏచూరి. దళితులు,ముస్లింల మీద దాడి జరుగుతుంటే వైసీపీ ప్రభుత్యం ఏమి చేస్తుంది. ప్రజల వైపా కేంద్రం వైపా అనేది వైసీపీ నిర్ణయం తీసుకోవాలి. వైసిపి లౌకిక వాదం వైపా లేక కేంద్రం వైపా? ప్రత్యేక హోదా కోసం వైసీపీ కేంద్రం పై వత్తిడి చెయ్యడంలేదు. కేంద్రం నుండి రావాల్సిన 36 వేల కోట్ల రూపాయలు ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.

Read Also: Big Breking: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు..

రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైసిపికి పార్లమెంట్లో సంఖ్య బలం వున్న కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారన్నారు. విశాఖ ఉక్కు అమ్మకానికి సిద్ధం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడలేదు. రాష్ట్రంలో ఒక అడ్డగోలు ప్రభుత్వం నడుస్తుంది. చెత్త పన్ను వేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో వేస్తారు. డబ్బు లేకపోతే మోదీ జుట్టు పట్టుకుని రూ.36 వేల కోట్లు తీసుకురండి. రాష్ట్రంలో మోదీ రాజ్యం నడుస్తుంది. కేంద్రంలో బిజెపి అదేశాలు…. ఇక్కడ జగన్ అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అధానిప్రదేశ్ గా మార్చుతున్నారు. కౌలు రైతులను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈ రెండు సంవత్సరాల్లో అయిన జగన్ ప్రభుత్వంలో మార్పు రాకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు. కమ్యూనిస్ట్ ల కాలం చెల్లింది అనే వారి కాలం చెల్లుతుంది. దేశంలో కేరళ మాత్రమే రైతులకు న్యాయం చేస్తుంది. వికేంద్రీకరణ అనేది కేరళ వెళ్ళి నేర్చుకోండి.. మోదీ అంటే జగన్ కు భయం… అందుకే మోదీ ఏం చేసిన అడగడన్నారు శ్రీనివాస్.

Read Also: Ponniyin Selvan: టాలీవుడ్ ప్రముఖులూ మారండయా… మారండి…!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adani
  • Bjp Vs CPIM
  • cm jagan
  • india debts
  • Modi govt

తాజావార్తలు

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

  • Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..

  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!

  • NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..

  • Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions