Singapore: 20 ఏళ్ల తర్వాత మొదటిసారి మహిళకు ఉరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్న విషయంలో సింగపూర్ ప్రభుత్వం అత్యంత కఠిన శిక్షలు అమలు చేస్తుంది. ఇందుకు సంబంధించిన కేసులో ఇద్దరు దోషులను ఉరి తీయనున్నారు. ఆ శిక్షను ఈ వారం అమలు చేయనుంది. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. గత 20 ఏళ్లలో సింగపూర్ లో ఓ మహిళను ఉరి తీయడం ఇదే మొదటిసారి. మరోవైపు ఈ ఉరిశిక్షల అమలును నిలిపివేయాలని అక్కడి హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
Srikanth Meka: హీరో శ్రీకాంత్ ఇంట పెళ్లి భాజాలు
Also Read
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
ఓ 56 ఏళ్ల వ్యక్తి 50 గ్రాముల హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేశాడు. దీంతో ఈ కేసులో దోషిగా తేల్చి బుధవారం (జూలై 26)న చాంగీ జైలులో ఉరి తీయనున్నారు. ఈ మేరకు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ ఫార్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ తెలిపింది. ఇదే కేసులో మరో మహిళ సారిదేవి దామని(45)కి జూలై 28వ తేదీన ఉరి తీయనున్నారు. 30 గ్రాముల హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేసిన కేసులో సారిదేవికి 2018లో ఉరిశిక్ష విధించారు. అప్పటినుంచి జైల్లోనే ఉన్న సారీ దేవికి ఇప్పుడు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇప్పటికే వారి కుటుంబాలకు నోటీసులు పంపించారని టీజేసీ పేర్కొంది. కానీ దీనిపై జైలు అధికారులు ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు.
Vaishnavi Chaitanya: ‘బేబీ’ని మెచ్చిన ఇస్మార్ట్ రామ్.. వాటిని పట్టుకొని గాల్లో తేలిపోతున్న వైష్ణవి
ఈ ఉరిశిక్ష అమలు అయితే 20 ఏళ్లలో ఓ మహిళను ఉరి తీయడం సింగపూర్లో ఇదే మొదటిసారి అవుతుంది. చివరగా 2004లో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో 36 ఏళ్ల మహిళకు ఉరిశిక్ష వేశారని టీజేసీ కార్యకర్త కోకిల అన్నామలై తెలిపారు. సింగపూర్ లో ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. హత్యలు, కిడ్నాప్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి కేసుల్లో మరణ శిక్షలలు విధిస్తారు. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేసిన కేసుల్లో దోషులకు మరణశిక్ష విధిస్తారు. కరోనా నేపథ్యంలో సింగపూర్ లో రెండేళ్ల పాటు మరణశిక్షలను అమలు చేయకుండా ఆపేశారు. ప్రస్తుతం మళ్ళీ అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 13మందిని ఉరి తీశారు.
తాజావార్తలు
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?