Sikkim: సిక్కింలో మూడు జిల్లాలకు అలర్ట్.. షాకో చో సరస్సు ఎప్పుడైనా తెగిపోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sikkim: సిక్కిం రాష్ట్రానికి దెబ్బమీద దెబ్బ తగులుతూ ఉన్నాయి. వరదలతో రాష్ట్రం ఇప్పటికే అతలాకుతంల అవుతోంది. ఈ సమయంలోనే మరో విపత్తు పొంచి ఉంది. ఈ ప్రాంతంలో మరొక సరస్సు తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది. లొనాక్ సరస్సు తెగిపోవడం వల్ల కలిగే పరిణామాలు ఊహకు అందని విధంగా ఉన్నాయి. సిక్కిం చుట్టుపక్కల విధ్వంసకర దృశ్యం కనిపిస్తోంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మంది గల్లంతయ్యారు. ఇప్పుడు మంగన్ జిల్లాలో షాకో చో సరస్సు పగిలిపోతుందనే భయం నెలకొంది. ఈ మేరకు అలర్ట్ కూడా జారీ చేశారు.
సిక్కిం మరోసారి తీవ్ర విధ్వంసం ఎదుర్కొనే అవకాశం ఉంది. మంగన్ జిల్లాలోని లాచెన్ సమీపంలోని లోనక్ సరస్సు, షాకో చో సరస్సు కూడా పగిలిపోయే ప్రమాదం ఉన్నందున ఆ ప్రాంతంలో వరదలు మళ్లీ విధ్వంసం సృష్టించగలవు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని సరస్సు సమీపంలోని ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఈ సరస్సు తంగు గ్రామం పైన ఉంది. ఇక్కడికి వెళ్లాల్సిన రోడ్డు వరదలో కొట్టుకుపోయింది.
Also Read
- Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
- Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
- Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
Read Also:Today Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంత ఉందంటే?
ఈ ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉంది
* గ్యాంగ్టక్ జిల్లా సింగ్టామ్
* మంగన్ జిల్లా దిక్కు
* పాక్యోంగ్ జిల్లాకు చెందిన రంగ్పో, గోలిటార్
బీఆర్వో సైనికులు రోడ్లను క్లియర్ చేయడం, వీలైనంత త్వరగా ప్రజలను ఖాళీ చేయడంలో బిజీగా ఉన్నారు. షాకో చో సరస్సు పైన ఉన్న హిమానీనదం ఉష్ణోగ్రతలో అసాధారణ పెరుగుదల ఉన్నట్లు శాటిలైట్ డేటా తేలిందని BRO అధికారులు తెలిపారు. ఇలాగే కొనసాగితే సరస్సు ఎప్పుడైనా పగిలిపోయే ప్రమాదం ఉంది. అకస్మాత్తుగా నీరు రావడంతో సరస్సు పగిలిపోతే, అది ప్రజలకు తీవ్ర హాని కలిగిస్తుంది. దీంతో ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Read Also:Today Horoscope: శనివారం ఈ రాశులవారు శుభవార్తలు వింటారు.. ఆర్థిక లాభాలు..
16000 అడుగుల ఎత్తులో చిక్కుకున్న 68 మంది
వరదల కారణంగా 68 మంది 16000 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారని మీకు తెలియజేద్దాం. ఐటీబీపీ రెస్క్యూ టీమ్ భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మొత్తం 68 మందిని సురక్షితంగా రక్షించింది.
ఇప్పటి వరకు 26 మంది మృతి
సిక్కింలో వరదల కారణంగా అలజడి చెలరేగుతోంది. లొనాక్ సరస్సుపై మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో అకస్మాత్తుగా వచ్చిన వరద కారణంగా ఇప్పటివరకు 26 మంది మరణించారు. అదే సమయంలో, 2413 మందిని రక్షించగా, 142 మంది ఇప్పటికీ అదృశ్యమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
-
Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!