Chandrayaan-3: చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు.. కీలక విషయాలు బయటపెట్టిన ఇస్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోందని ఇస్రో ప్రకటించింది. అంతేకాకుండా మిషన్లో భాగంగా దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ పలు కీలక సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే తాను సేకరించిన విషయాలన్నింటినీ ఇస్రోకు పంపిస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, అక్కడి వాతావరణం ఎలా ఉందన్న విషయాలకు చెందిన సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. తాజాగా.. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నాయని కనుగొన్నది. అలాగే చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సల్ఫర్ ఉనికిని తొలిసారి గుర్తింంచినట్లు తెలిపింది. వీటితో పాటు ఇంకొన్ని ఖనిజాలు ఉన్నట్లుగా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) ట్విట్టర్ వేదికగా తెలిపింది.
Read Also: Mallikarjun Kharge: గ్యాస్ ధర తగ్గింపుపై విమర్శలు.. ఎన్నికల లాలీపాప్గా అభివర్ణించిన ఖర్గే
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
చంద్రుడి ఉపరితలంలో అల్యూమినియం ( Al ), కాల్షియం (Ca), ఐరన్(Fe), క్రోమియం ( Cr), టైటానియం (Ti), మాంగనీస్ (Mn), సిలికాన్ (Si), ఆక్సిజన్ (O)ను కూడా కనుగొన్నట్లు ప్రజ్ఞాన్ రోవర్ పేర్కొంది. చంద్రుడిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు, అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకు లిబ్స్ ( లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్) అనే పరికరాన్ని ప్రజ్ఞాన్ రోవర్కు ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. ఆ పరికరమే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఖనిజాలను గుర్తించింది. హైడ్రోజన్ కోసం కూడా శోధన కొనసాగుతుందని ఇస్రో ట్వీట్ చేసింది. ప్రజ్ఞాస్ రోవర్లో అమర్చిన లిబ్స్ పరికరాన్ని బెంగళూరుకు చెందిన ల్యాబరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ డెవలప్ చేసిందని తెలిపింది.
Read Also: Kalki 2898AD: బిగ్ బ్రేకింగ్.. కల్కి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి ..?
దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ఉపరితల ఉష్ణోగ్రతలను లెక్కించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇస్రో పంచుకుంది. జాబిల్లి ఉపరితలంపై 50.5 డిగ్రీల సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలుంటే.. 80 మి.మీల లోతులో మైనస్ 10 డిగ్రీల సెల్సియస్గా ఉన్నట్లు విక్రమ్ ల్యాండర్లోని పేలోడ్ చాస్టే గుర్తించింది. ల్యాండింగ్ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు 20- 30 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండొచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
Chandrayaan-3 Mission:
In-situ scientific experiments continue …..
Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL
— ISRO (@isro) August 29, 2023
తాజావార్తలు
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!