Chandrayaan-3: చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు.. కీలక విషయాలు బయటపెట్టిన ఇస్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోందని ఇస్రో ప్రకటించింది. అంతేకాకుండా మిషన్లో భాగంగా దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ పలు కీలక సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే తాను సేకరించిన విషయాలన్నింటినీ ఇస్రోకు పంపిస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, అక్కడి వాతావరణం ఎలా ఉందన్న విషయాలకు చెందిన సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. తాజాగా.. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నాయని కనుగొన్నది. అలాగే చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సల్ఫర్ ఉనికిని తొలిసారి గుర్తింంచినట్లు తెలిపింది. వీటితో పాటు ఇంకొన్ని ఖనిజాలు ఉన్నట్లుగా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) ట్విట్టర్ వేదికగా తెలిపింది.
Read Also: Mallikarjun Kharge: గ్యాస్ ధర తగ్గింపుపై విమర్శలు.. ఎన్నికల లాలీపాప్గా అభివర్ణించిన ఖర్గే
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
చంద్రుడి ఉపరితలంలో అల్యూమినియం ( Al ), కాల్షియం (Ca), ఐరన్(Fe), క్రోమియం ( Cr), టైటానియం (Ti), మాంగనీస్ (Mn), సిలికాన్ (Si), ఆక్సిజన్ (O)ను కూడా కనుగొన్నట్లు ప్రజ్ఞాన్ రోవర్ పేర్కొంది. చంద్రుడిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు, అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకు లిబ్స్ ( లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్) అనే పరికరాన్ని ప్రజ్ఞాన్ రోవర్కు ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. ఆ పరికరమే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఖనిజాలను గుర్తించింది. హైడ్రోజన్ కోసం కూడా శోధన కొనసాగుతుందని ఇస్రో ట్వీట్ చేసింది. ప్రజ్ఞాస్ రోవర్లో అమర్చిన లిబ్స్ పరికరాన్ని బెంగళూరుకు చెందిన ల్యాబరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ డెవలప్ చేసిందని తెలిపింది.
Read Also: Kalki 2898AD: బిగ్ బ్రేకింగ్.. కల్కి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి ..?
దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ఉపరితల ఉష్ణోగ్రతలను లెక్కించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇస్రో పంచుకుంది. జాబిల్లి ఉపరితలంపై 50.5 డిగ్రీల సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలుంటే.. 80 మి.మీల లోతులో మైనస్ 10 డిగ్రీల సెల్సియస్గా ఉన్నట్లు విక్రమ్ ల్యాండర్లోని పేలోడ్ చాస్టే గుర్తించింది. ల్యాండింగ్ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు 20- 30 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండొచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
Chandrayaan-3 Mission:
In-situ scientific experiments continue …..
Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL
— ISRO (@isro) August 29, 2023
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..