Sierra Leone: మనుషుల ఎముకలతో డ్రగ్స్ తయారీ.. అత్యవసర పరిస్థితిని విధించిందిన ప్రభుత్వం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో అనేక మంది యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా అనేక దేశాల్లో యువత పెడదారు పడుతున్నారు. ఇకపోతే తాజాగా పశ్చిమ ఆఫ్రికా దేశమైనా సియెర్రా లియెన్ లో కొన్ని రకాల మత్తు పదార్థాలు బీభస్తాన్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశం పూర్తిగా మాదకద్రవ్యాల సమస్యలతో సతమతమవుతోంది. దేశంలో పరిస్థితి చేయిదాటడంతో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. దేశంలోని యువకులు ఒక రకమైన మతపదార్థాన్ని తీసుకోవడం ద్వారా వారు దేశంలోని వీధుల్లో ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నారు. ఈ సంఘటనలతో ఆ దేశ అధ్యక్షుడు జులియస్ బయో ఇటీవల దేశంలో ఎమర్జెన్సీని విధించాడు.
Also Read: AP Heat Wave: ఏపీకి అలర్ట్.. రానున్న రెండ్రోజుల పాటు తీవ్ర వడగాల్పులు
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
ఆ దేశం ఎదుర్కొనే అతిపెద్ద సమస్యని ‘కుష్’ అనే డ్రగ్స్. ఈ రకమైన కొత్త డ్రగ్ ను సేవించి అక్కడ జనం పూర్తిగా మత్తులో ఊగిపోతున్నారు. ఈ రకమైన డ్రగ్ ఆరు సంవత్సరాల క్రితం ఆ దేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో.. ఆ దేశ యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇకపోతే ‘కుష్’ అనే మత్తుమందు మనుషుల ఎముకలతో తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ ను తయారు చేసేందుకు మనుషులు ఎముకలను వాడుతున్నట్లు అక్కడి కథనాలు పేర్కొంటున్నాయి.
Also Read: IPL 2024: రమణదీప్ సింగ్ ‘స్టన్నింగ్ క్యాచ్’.. షారూక్ ఖాన్ చప్పట్లతో ప్రశంసలు
ఈ డ్రగ్స్ కు భారీగా డిమాండ్ ఉండడంతో ఆ దేశంలో కొందరు స్మశానాల వెంటపడుతూ.. దొంగలకు డబ్బులు ఇచ్చి మరి సమాధులను తవ్వుతూ దేశ ప్రజల అస్తిపంజరలను ఎత్తుకెళ్తున్నారు. అస్తిపంజరల ఎముకలను స్వాహా చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో స్మశానాల నుండి వందలాది సమాధులను తవ్వినట్లు అక్కడ పోలీసులు తెలిపారు. దీంతో స్మశానాల వద్ద అక్కడి ప్రభుత్వం పటిష్ట నిగానను ఏర్పాటు చేసింది. కుష్ అనే డ్రగ్ వల్ల తమ దేశ అస్తిత్వానికి మనుగడ ఏర్పడిందని.. ఆ దేశ అధ్యక్షుడు స్వయంగా ఈ విషయాన్ని తెలుపుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీసుకుంటున్న వారి మరణాల సంఖ్య రోజుకు మరింతగా పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులోంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి దేశంలోని ప్రతి జిల్లాలో డీ- అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా వీటిని తీసుకోవడం ద్వారా అనేక మంది యువతలో అవయవాలు దెబ్బతిని చనిపోతున్నట్లు డాక్టర్లు తెలిపారు.
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!