Sidhu Moosewala: లోక్సభ బరిలోకి సిద్ధూ మూసేవాలా తండ్రి.. ఎక్కడ్నుంచంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. బటిండా లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆ రాష్ట్ర కాంగ్రెస్ స్వాగతించింది. బల్కౌర్ సింగ్ ఎన్నికల్లో పోటీ చేస్తే స్వాగతిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Crime: డీజిల్ మాఫియా గుట్టు రట్టు.. రూ.35 లక్షల విలువైన ఇంధనం స్వాధీనం
Also Read
- Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
- Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
- PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
పంజాబ్లో 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతుండగా.. పంజాబ్లో మాత్రం చివరి దశలో.. అనగా జూన్ 1న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అయితే ఇక్కడ ఇండియా కూటమిలో ఆప్-కాంగ్రెస్ ఉన్నప్పటికీ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. ఇక బటిండా నియోజకవర్గం నుంచి సిద్ధూ మూసేవాలా తండ్రి పోటీకి సిద్ధపడుతున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారన్నది క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ నుంచి చేస్తారా? లేదంటే స్వతంత్రంగా చేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది.
ఇదిలా ఉంటే బటిండా స్థానం గత కొన్నేళ్లుగా శిరోమణి అకాలీదళ్కు కంచుకోటగా ఉంది. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జీత్ మొహిందర్ సింగ్ సిద్ధూ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి పరంపాల్ కౌర్ సింధు బరిలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ నుంచి గుర్మీత్ సింగ్ ఖుదీయాన్ రంగంలోకి దించింది. ఇలా బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 2019లో శిరోమణి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ రాజా వారింగ్పై గెలిచారు.
ఇది కూడా చదవండి: CDS: “ప్రజల డబ్బును బలవంతంగా డిపాజిట్ చేయించిన కాంగ్రెస్”.. ఆ చట్టం ఏంటీ, ఇప్పుడు బీజేపీ ఎందుకు విమర్శిస్తోంది..
సిద్ధూ మూసేవాలా 2021, డిసెంబర్లో కాంగ్రెస్లో చేరారు. 2022లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 28 ఏళ్ల వయసులో 2022, మే 29న మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో దుండగులు జరిపిన కాల్పుల్లో సిద్ధూ మూసేవాలా మరణించారు. ఇదిలా ఉంటే ఇటీవలే సిద్ధూ మూసేవాల తల్లి సరోగసి ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై కేంద్రం కూడా అధికారుల నుంచి సమాచారం కోరింది. ఇక తాజాగా బల్కౌర్ సింగ్ ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తు్న్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ విడత శుక్రవారం జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. చివరి దశలోనే బటిండా నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: X TV: వీడియోల కోసం.. యూట్యూబ్కు పోటీగా ‘ఎక్స్’ టీవీ యాప్..
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!