Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఒక కారు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు జలసమాధి అయ్యారు. మృతులందరూ బలవంతపూర్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదంలో బలవంతపూర్ వాసి రాజు (35), ఆయన భార్య భాగ్య (22), వారి ఐదేళ్ల కుమారుడు నియాన్ష్, మూడేళ్ల కుమార్తె శాన్విక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటలో నివాసముంటున్న బంధువుల ఇంట్లో ఇటీవల జరిగిన దశదిన కర్మ కార్యక్రమానికి రాజు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. వేడుక ముగించుకుని రాత్రి సమయంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అర్థరాత్రి దాటినా వారు ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాజు , ఆయన భార్య భాగ్య ఫోన్లకు వరుసగా కాల్స్ చేశారు. ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అని రావడంతో అనుమానం వచ్చిన బంధువులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, అప్పనపల్లి గ్రామ శివారులోని ప్రధాన రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావిలో ఒక కారు మునిగిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. వాహనం లోపల పరిశీలించగా నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. చీకట్లో డ్రైవింగ్ చేస్తుండగా అదుపు తప్పి కారు నేరుగా బావిలోకి దూసుకెళ్లడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, ఇద్దరు చిన్నారి పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో బలవంతపూర్ , అప్పనపల్లి గ్రామాల్లో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. చిన్నపిల్లల మృతదేహాలను చూసి బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ప్రమాదం జరిగిన తీరుపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!